ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పాటు పడ్డారని సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ అన్నారు. అధికార పార్టీకి మద్దతుగా నిలిచిన లక్షా 50 వేల ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్లోని యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
తెరాస అభ్యర్థుల విజయం పట్ల సీపీఎస్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.