ETV Bharat / state

ప్రభుత్వాల తీరుతో ప్రజల అవస్థలు: నారాయణ

author img

By

Published : May 4, 2020, 11:49 AM IST

వలస కార్మికులు, పేదల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఒకవేళ పరిష్కరించకపోతే లాక్​డౌన్​ను అతిక్రమించి ప్రత్యేక పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

లాక్​డౌన్​ను అతిక్రమించి పోరాటం చేస్తాం: నారాయణ
లాక్​డౌన్​ను అతిక్రమించి పోరాటం చేస్తాం: నారాయణ

కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే ప్రధాని అనూహ్య నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించిన తర్వాత లాక్​డౌన్ ప్రకటిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ మఖ్దూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్‌పాషాలతో కలిసి ఆయన దీక్షకు దిగారు.

రేషన్ కార్డు లేకున్నా వలస కార్మికులకు బియ్యం ఇస్తామని చెప్పి విస్మరించారని నారాయణ ఆరోపించారు. గ్రీన్, ఆరెంజ్ జోన్​లలో మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని కేంద్రం ప్రకటించడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. లాక్​డౌన్ ఎత్తివేసే వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని డిమాండ్ చేశారు.

రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ పరిష్కరించకపోతే లాక్​డౌన్​ను అతిక్రమించి ప్రత్యేక పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. నాయకుల దీక్ష సాయంత్రం 5 వరకు కొనసాగనుంది.

ఇవీ చూడండి: భద్రాద్రిలో మంటలు.. భయాందోళనలో ప్రజలు

కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే ప్రధాని అనూహ్య నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించిన తర్వాత లాక్​డౌన్ ప్రకటిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ మఖ్దూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్‌పాషాలతో కలిసి ఆయన దీక్షకు దిగారు.

రేషన్ కార్డు లేకున్నా వలస కార్మికులకు బియ్యం ఇస్తామని చెప్పి విస్మరించారని నారాయణ ఆరోపించారు. గ్రీన్, ఆరెంజ్ జోన్​లలో మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని కేంద్రం ప్రకటించడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. లాక్​డౌన్ ఎత్తివేసే వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని డిమాండ్ చేశారు.

రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ పరిష్కరించకపోతే లాక్​డౌన్​ను అతిక్రమించి ప్రత్యేక పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. నాయకుల దీక్ష సాయంత్రం 5 వరకు కొనసాగనుంది.

ఇవీ చూడండి: భద్రాద్రిలో మంటలు.. భయాందోళనలో ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.