హైదరాబాద్ మంగళహాట్కి చెందిన ఓ వ్యక్తి... నైజీరియా, లాగోస్ నుండి అబుదాబి మీదుగా విమానంలో ముంబైకి వచ్చాడు. అక్కడి నుంచి ముంబై ఎక్స్ప్రెస్ రైలులో ఉదయం నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. మోసిన్ చేతిపై హోమ్ క్వారంటైన్ స్టాంప్ ఉండడం చూసి... తోటి ప్రయాణికుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందుకున్న నాంపల్లి రైల్వే పోలీసులు వెంటనే మోసిన్ అలీని 108 అంబులెన్స్లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతనితో ఎవరు సన్నిహితంగా ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఇటలీలో ఆగని కరోనా మరణాలు- ఒక్కరోజులో 793 మంది