సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ నగర్ బస్తీలో సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 10 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 5 గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం అంబేడ్కర్ నగర్లో ఉంటున్న పాత నేరస్తుడు శివ అనే వ్యక్తిని మారేడుపల్లి పోలీసులు అరెస్టు చేయగా తులాల కొద్దీ నగలు అతని వద్ద లభ్యమయ్యాయి. అతని ఇంటిని పోలీసులు సోదా చేశారు.
ఇవీ చూడండి: నేడు తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన