ETV Bharat / state

పెట్రో ధరల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం: కాంగ్రెస్

author img

By

Published : Jun 29, 2020, 12:23 PM IST

పెట్రోల్, డీజీల్ ధరల పెంపును నిరసిస్తూ... గాంధీభవన్​ నుంచి హైదరాబాద్​ కలెక్టరేట్​ వరకు కాంగ్రెస్​ శ్రేణులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పెట్రో ధరలు పెంచడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Congress protests over petrol and diesel price hike
పెట్రోల్​, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన

పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనకు దిగాయి. గాంధీభవన్ నుంచి హైదరాబాద్​ కలెక్టరేట్‌కు ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు కొందరిని మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు.

వరుసగా పెంచుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని.. ఆ పార్టీ సీనియర్‌ నేతలు అంజన్‌కుమార్ యాదవ్‌, దాసోజు శ్రవణ్‌ డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ... పెట్రోలియం ధరలు పెంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనకు దిగాయి. గాంధీభవన్ నుంచి హైదరాబాద్​ కలెక్టరేట్‌కు ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు కొందరిని మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు.

వరుసగా పెంచుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని.. ఆ పార్టీ సీనియర్‌ నేతలు అంజన్‌కుమార్ యాదవ్‌, దాసోజు శ్రవణ్‌ డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ... పెట్రోలియం ధరలు పెంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: హోంమంత్రికి కరోనా.. వైద్యాధికారులు ఏమంటున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.