గణేశ్ నిమజ్జనం సందర్భంగా రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కాప్రా, సఫీల్ గూడ, రాంపల్లి చెరువులను సందర్శించారు. అనంతరం గణేశ్ పూజలో పాల్గొన్నారు. భక్తులు ఆటపాటలతో గణనాథులకు చెరువు వద్ద ఘన స్వాగతం పలికారు. రాచకొండ పరిధిలో సుమారు 6 వేల మంది సిబ్బంది పోలీసులతో బందోబస్తును నిర్వహిస్తున్నామని భగవత్ పేర్కొన్నారు. కాప్రా, సఫీల్ గూడ చెరువుల వద్ద 10 వరకు భారీ క్రేన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వదంతులేవీ నమ్మవద్దని నిమజ్జనాల వద్ద ఎలాంటి సమస్య ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిమజ్జనాలు రేపు ఉదయం వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : ఖైరతాబాద్ గణపతికి ఆ డ్రైవరే ఏడోసారి