ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్నగర్లో దొంగలు రెచ్చిపోయారు. కౌసల్య అపార్ట్మెంట్లో చొరబడి నాలుగున్నర లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అపార్ట్మెంటులోని 203 నంబర్గల ఇంట్లో రవిశంకర్ శర్మ నివాసముంటున్నారు. సోమవారం సాయంత్రం కూరగాయల కోసం మార్కెట్కు వెళ్లాడు. తిరిగొచ్చేసరికి ఇంట్లో బీరువా తెరచి ఉంది. అందులో బంగారు నగలను అపహరించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
20 నిమిషాల్లోనే దోచేశారు..
కూరగాయలకు వెళ్లొచ్చిన 20నిమిషాల వ్యవధిలోనే దొంగతనం జరిగిందని తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇవీ చూడండి:బాధ్యతలు పక్కాగా నిర్వహిస్తాం