రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ రైతులను పక్కదారి పట్టిస్తోందని భాజపా ఎమ్మెల్సీ రామచందర్రావు ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులకు భాజపా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విద్యుత్ సవరణ చట్టంపై మండలిలో చర్చకు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసినట్లు ఆయన తెలిపారు.
దేశంలో 12 రాష్ట్రాలు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నాయన్న ఆయన... తెరాస ప్రభుత్వం తామే అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు.
కేంద్రం తీసుకువచ్చింది కేవలం విద్యుత్ చట్ట సవరణ మాత్రమేనని తెలిపారు. విద్యుత్ సవరణ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్చ సరైంది కాదన్నారు. తెరాసకు ఈ చట్టంపై అభ్యంతరం ఉంటే పార్లమెంట్లో మాట్లాడొచ్చునని పేర్కొన్నారు.