ETV Bharat / state

గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లేవి: ఎమ్మెల్సీ రాంచందర్ రావు

author img

By

Published : Aug 27, 2020, 3:47 PM IST

గణేశ్ నిమజ్జనానికి పోలీసులు సహకరించాలని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్​ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

bjp-mlc-ram-chandar-rao-demands-iganesh-idol-mmersion-arrangements-in-hyderabad
గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లేవి:

ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే వినాయక చవితి పండుగ కరోనా వల్ల ఈ ఏడాది నిరాడంబరంగా జరుపుకోవాల్సి వస్తోందని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నవరాత్రి ఉత్సవాలను నిలిపివేయాలని పోలీసులు బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. నగర శివారు ప్రాంతాల్లో నిమజ్జనం చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ఒక వర్గం పండుగలకు అనుమతిస్తూ బోనాలు, గణేశ్ ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదన్నారు. నిమజ్జనానికి ట్యాంక్ బండ్​పై ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి వివక్ష చూపకుండా నిమజ్జనానికి సహకరించాలని రాంచందర్ రావు కోరారు. ఈ మేరకు సీపీ అంజనీ కుమార్​ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే వినాయక చవితి పండుగ కరోనా వల్ల ఈ ఏడాది నిరాడంబరంగా జరుపుకోవాల్సి వస్తోందని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నవరాత్రి ఉత్సవాలను నిలిపివేయాలని పోలీసులు బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. నగర శివారు ప్రాంతాల్లో నిమజ్జనం చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ఒక వర్గం పండుగలకు అనుమతిస్తూ బోనాలు, గణేశ్ ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదన్నారు. నిమజ్జనానికి ట్యాంక్ బండ్​పై ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి వివక్ష చూపకుండా నిమజ్జనానికి సహకరించాలని రాంచందర్ రావు కోరారు. ఈ మేరకు సీపీ అంజనీ కుమార్​ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.