సీఎం కేసీఆర్ 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 16న 566 మంది కవలలతో సేవ్ సోసైటీ స్వచ్ఛంద సంస్థ 2కె రన్ నిర్వహిస్తోంది. రవీంద్రభారతి నుంచి లలితా కళాతోరణం వరకు జరిగే పరుగును మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ 66వ పుట్టిన రోజు సందర్భంగా 66 కిలోల కేక్తో పాటు 66 కొవ్వొత్తులు, 566 మొక్కలు నాటి, 666 హీలియం బెలూన్స్ ఎగరవేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ సోదరులు, రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని నిర్వహకులు తెలిపారు. 2కె రన్లో పాల్గొనాలనుకునే వారు 9121066647 నంబర్కి ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఏప్రిల్ 26న నెక్లెస్ రోడ్డులో 5066 మంది కవలలో ట్విన్ సీటీ- ట్విన్స్ కార్నివాల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కవలలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... వారికి చేయూతనిచ్చేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సేవ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గోసుల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.