ETV Bharat / state

గన్​పార్క్​ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. బండి సంజయ్​, ఈటల అరెస్ట్​

Police arrested Bandi Sanjay at TSPSC: టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీనీ నిరసిస్తూ బండి సంజయ్ గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపడుతామని తొలుత ప్రకటించినప్పటికీ.. అనూహ్యంగా అమర వీరుల స్థూపం వద్ద దీక్షకు కూర్చున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం అక్కడ్నుంచి టీఎస్​పీఎస్సీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరేందుకు యత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బండి సంజయ్, ఈటల సహా పలువురు నేతలను అరెస్ట్‌ చేశారు.

author img

By

Published : Mar 17, 2023, 4:34 PM IST

BANDI SANJAY
BANDI SANJAY

Police arrested Bandi Sanjay at TSPSC: లక్షలాది మంది నిరుద్యోగులు, వాళ్ల కుటుంబాలు పేపర్ లీకేజీతో అల్లాడుతుంటే.. దొంగ సారా దందా చేసిన లిక్కర్ క్వీన్​ను కాపాడుకునేందుకు మంత్రివర్గమంతా దిల్లీ వెళ్లారని బీఆర్​ఎస్​ నాయకులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మంత్రులకు సిగ్గు లేదా? నిరుద్యోగుల కంటే కేసీఆర్ బిడ్డే మీకు ముఖ్యమా అని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ సర్పంచ్ బిడ్డ కోసం పేపర్ లీకేజీ చేస్తారా అన్నారని విమర్శించారు. ఈ విధమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు.

టీఎస్పీఎస్సీ లీకేజీకి కారణం ఐటీ వైఫల్యమే.. దీనికి బాధ్యతగా మంత్రి కేటీఆర్​ను బర్తరఫ్ చేయాలనీ బండి సంజయ్​ డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీనీ నిరసిస్తూ గన్ పార్కులోని అమర వీరుల స్థూపం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి బండి దీక్ష చేపట్టారు. కుంటిసాకులు చెప్పి ఈటల రాజేందర్​ను బర్తరఫ్ చేసిన కేసీఆర్.. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రధాన కారకుడైన కేటీఆర్​ను ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ఎద్దేవా చేశారు.

వెంటనే కేటీఆర్​ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు. సీఎం కేసీఆర్​కు నిజంగా చిత్తశుద్ధి అనేదే ఉంటే.. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ సవాల్​ విసిరారు. టీఎస్​పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి పేపర్ లీకేజీ అక్రమాలపై వాస్తవాలు తెలుసుకుంటానని.. బీజేపీ కార్యకర్తలంతా టీఎస్​పీఎస్సీకి తరలి రావాలని బండి సంజయ్​ పిలుపునిచ్చారు.

అప్రమత్తమైన పోలీసులు బండి సంజయ్​ని అరెస్ట్ చేసేందుకు.. వెళ్లగా పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. వలయంగా ఏర్పడి అరెస్ట్ చేయకుండా నిరోధించారు. ఎట్టకేలకు పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి బండి సంజయ్, ఈటల రాజేందర్​తో పాటు.. పార్టీ ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు. బండి సంజయ్​ను కార్ఖానా, ఈటల రాజేందర్​ను నాంపల్లి ఠాణాకు తరలించారు.

"టీఎస్​పీఎస్సీ విషయంలో 30 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసే వరకు కూడా బీజేపీ వెనకడుగు వేయదు. అందరూ వచ్చి బీజేపీ తరపున సంఘీభావం ప్రకటించండి. ఈ విషయాన్ని రైతులు గుర్తించండి, ఉద్యోగ.. ఉపాధ్యాయ వర్గాల వారు గుర్తించండి, మహిళలు గుర్తించండి.. మీరు అందరూ ఈ విషయంపై ఆలోచించండి. ఇప్పుడు భయపడితే.. మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. టీఎస్​పీఎస్సీ వద్ద బీజేపీ యువజన నాయకుల మీద లాఠీఛార్జ్​ చేశారు. విద్యార్థుల మీద లాఠీఛార్జ్​ చేశారు. ఇదే టీఎస్​పీఎస్సీలో ఎన్నో ఆక్రమాలు జరిగాయి. ఈ విషయంపై వెనక్కి తగ్గే పరిస్థితి లేదు." - బండి సంజయ్​, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Police arrested Bandi Sanjay at TSPSC: లక్షలాది మంది నిరుద్యోగులు, వాళ్ల కుటుంబాలు పేపర్ లీకేజీతో అల్లాడుతుంటే.. దొంగ సారా దందా చేసిన లిక్కర్ క్వీన్​ను కాపాడుకునేందుకు మంత్రివర్గమంతా దిల్లీ వెళ్లారని బీఆర్​ఎస్​ నాయకులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మంత్రులకు సిగ్గు లేదా? నిరుద్యోగుల కంటే కేసీఆర్ బిడ్డే మీకు ముఖ్యమా అని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ సర్పంచ్ బిడ్డ కోసం పేపర్ లీకేజీ చేస్తారా అన్నారని విమర్శించారు. ఈ విధమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు.

టీఎస్పీఎస్సీ లీకేజీకి కారణం ఐటీ వైఫల్యమే.. దీనికి బాధ్యతగా మంత్రి కేటీఆర్​ను బర్తరఫ్ చేయాలనీ బండి సంజయ్​ డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీనీ నిరసిస్తూ గన్ పార్కులోని అమర వీరుల స్థూపం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి బండి దీక్ష చేపట్టారు. కుంటిసాకులు చెప్పి ఈటల రాజేందర్​ను బర్తరఫ్ చేసిన కేసీఆర్.. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రధాన కారకుడైన కేటీఆర్​ను ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ఎద్దేవా చేశారు.

వెంటనే కేటీఆర్​ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు. సీఎం కేసీఆర్​కు నిజంగా చిత్తశుద్ధి అనేదే ఉంటే.. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ సవాల్​ విసిరారు. టీఎస్​పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి పేపర్ లీకేజీ అక్రమాలపై వాస్తవాలు తెలుసుకుంటానని.. బీజేపీ కార్యకర్తలంతా టీఎస్​పీఎస్సీకి తరలి రావాలని బండి సంజయ్​ పిలుపునిచ్చారు.

అప్రమత్తమైన పోలీసులు బండి సంజయ్​ని అరెస్ట్ చేసేందుకు.. వెళ్లగా పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. వలయంగా ఏర్పడి అరెస్ట్ చేయకుండా నిరోధించారు. ఎట్టకేలకు పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి బండి సంజయ్, ఈటల రాజేందర్​తో పాటు.. పార్టీ ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు. బండి సంజయ్​ను కార్ఖానా, ఈటల రాజేందర్​ను నాంపల్లి ఠాణాకు తరలించారు.

"టీఎస్​పీఎస్సీ విషయంలో 30 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసే వరకు కూడా బీజేపీ వెనకడుగు వేయదు. అందరూ వచ్చి బీజేపీ తరపున సంఘీభావం ప్రకటించండి. ఈ విషయాన్ని రైతులు గుర్తించండి, ఉద్యోగ.. ఉపాధ్యాయ వర్గాల వారు గుర్తించండి, మహిళలు గుర్తించండి.. మీరు అందరూ ఈ విషయంపై ఆలోచించండి. ఇప్పుడు భయపడితే.. మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. టీఎస్​పీఎస్సీ వద్ద బీజేపీ యువజన నాయకుల మీద లాఠీఛార్జ్​ చేశారు. విద్యార్థుల మీద లాఠీఛార్జ్​ చేశారు. ఇదే టీఎస్​పీఎస్సీలో ఎన్నో ఆక్రమాలు జరిగాయి. ఈ విషయంపై వెనక్కి తగ్గే పరిస్థితి లేదు." - బండి సంజయ్​, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.