ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని అహోబిలం సమీపంలోని నల్లమలలో పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎగువ అహోబిలానికి వెళ్లే రహదారిలోని టేకు వనంలో పులి సంచారంతో అటుగా వెళ్లే భక్తులు ఆందోళన చెందుతున్నారు.
అహోబిలం వెళ్లే రహదారి పక్కనే వాహనంలో ఉన్న కొందరు భక్తులు పులి కదలికలను చిత్రీకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.