ETV Bharat / state

ఏపీలో 111కు కరోనా కేసులు.. బాధితుల్లో అత్యధికులు దిల్లీకి వెళ్లినవారే

author img

By

Published : Apr 1, 2020, 11:42 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా అలజడి స్పష్టిస్తోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం సాయంత్రం 7 తరువాత కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనితో ఏపీలో వైరస్ పీడితుల సంఖ్య 111కు చేరింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.

111-corona-positive-cases-reported-in-andhra-pradesh
రాష్ట్రంలో 111కు కరోనా కేసులు... బాధితుల్లో అత్యధికులకు దిల్లీ లింకు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 111కు చేరింది. బుధవారం సాయంత్రం 7 గంటల తర్వాత కొత్తగా 24 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర నోడల్​ అధికారి విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో ఈ వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇవాళ ఒక్కరోజే కొత్తగా 11 పాజిటివ్​ కేసులు నిర్ధరణ అయ్యాయి. కొత్తగా అచ్చంపేట, క్రోసూరు మంగళగిరి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులను అధికారులు గుర్తించారు. నమోదైన పాజిటివ్ కేసులన్నీ దిల్లీకి వెళ్లివచ్చిన వారివేనని గుర్తించారు. దీంతో గుంటూరు జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమయ్యారు. బాధితులు వారం రోజుల్లో ఎవరెవరిని కలిశారో అధికారులు గుర్తిస్తున్నారు. బాధితులు కలిసిన వారందరినీ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాకరోనా పాజిటివ్ కేసులు
గుంటూరు20
కడప15
కృష్ణా15
ప్రకాశం15
పశ్చిమగోదావరి14
విశాఖపట్నం11
తూర్పుగోదావరి9
చిత్తూరు6
నెల్లూరు3
కర్నూలు1
అనంతపురం2
మొత్తం111

ఇదీ చదవండి: హైదరాబాద్​లో 'దిల్లీ' కుదుపు.. జమాత్​కు వెళ్లొచ్చిన వారే కారణం

ఆంధ్రప్రదేశ్​లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 111కు చేరింది. బుధవారం సాయంత్రం 7 గంటల తర్వాత కొత్తగా 24 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర నోడల్​ అధికారి విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో ఈ వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇవాళ ఒక్కరోజే కొత్తగా 11 పాజిటివ్​ కేసులు నిర్ధరణ అయ్యాయి. కొత్తగా అచ్చంపేట, క్రోసూరు మంగళగిరి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులను అధికారులు గుర్తించారు. నమోదైన పాజిటివ్ కేసులన్నీ దిల్లీకి వెళ్లివచ్చిన వారివేనని గుర్తించారు. దీంతో గుంటూరు జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమయ్యారు. బాధితులు వారం రోజుల్లో ఎవరెవరిని కలిశారో అధికారులు గుర్తిస్తున్నారు. బాధితులు కలిసిన వారందరినీ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాకరోనా పాజిటివ్ కేసులు
గుంటూరు20
కడప15
కృష్ణా15
ప్రకాశం15
పశ్చిమగోదావరి14
విశాఖపట్నం11
తూర్పుగోదావరి9
చిత్తూరు6
నెల్లూరు3
కర్నూలు1
అనంతపురం2
మొత్తం111

ఇదీ చదవండి: హైదరాబాద్​లో 'దిల్లీ' కుదుపు.. జమాత్​కు వెళ్లొచ్చిన వారే కారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.