ETV Bharat / state

జడ్పీ ఛైర్​పర్సన్ల ఎన్నికకు రంగం సిద్ధం

స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికల ప్రక్రియకు మరికొన్ని గంటల గడువే ఉంది. నేటి నుంచి ప్రారంభం కానున్న కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక కోసం నోటీసు జారీ చేయనున్నారు.

author img

By

Published : Jun 6, 2019, 5:35 AM IST

Updated : Jun 6, 2019, 1:36 PM IST

జడ్పీ ఛైర్​పర్సన్ల ఎన్నికకు రంగం సిద్ధం

స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. మండల ప్రజాపరిషత్​లలో కోఆప్టెడ్ సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక కోసం నేడు నోటీసు జారీ చేయనున్నారు. రాష్ట్రంలోని 538 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలకు పూర్తై ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రేపు పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రిసైడింగ్ అధికారులను నియమించింది. ప్రిసైడింగ్ అధికారులు ఇవాళ నోటీసు జారీ చేయనున్నారు. కోఆప్టెడ్ సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నిక కోసం మండల పరిషత్​ల ప్రత్యేక సమావేశం రేపు జరగనుంది.

జడ్పీ ఛైర్​పర్సన్ల ఎన్నికకు రంగం సిద్ధం

ఇప్పటివరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాతే కో ఆప్టెడ్ సభ్యుల్ని, మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేవారు. పాత పాలక వర్గాల పదవీకాలం అయిపోగానే మొదటి సమావేశం నిర్వహించేవారు. ఇప్పుడు చట్ట సవరణతో మార్పులు వచ్చాయి. ఈ నెల 7న ఎంపీటీసీలు, 8న జడ్పీటీసీలు ప్రమాణం చేయకుండానే ప్రత్యేక సమావేశాల్లో పాల్గొని తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. కో- ఆప్టెడ్ సభ్యుల ఎంపికలో పార్టీ విప్ వర్తించదు.

ఇవీ చూడండి: పుర ఎన్నికలకు 2 రోజుల్లో అధికారిక ప్రకటన...!

స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. మండల ప్రజాపరిషత్​లలో కోఆప్టెడ్ సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక కోసం నేడు నోటీసు జారీ చేయనున్నారు. రాష్ట్రంలోని 538 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలకు పూర్తై ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రేపు పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రిసైడింగ్ అధికారులను నియమించింది. ప్రిసైడింగ్ అధికారులు ఇవాళ నోటీసు జారీ చేయనున్నారు. కోఆప్టెడ్ సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నిక కోసం మండల పరిషత్​ల ప్రత్యేక సమావేశం రేపు జరగనుంది.

జడ్పీ ఛైర్​పర్సన్ల ఎన్నికకు రంగం సిద్ధం

ఇప్పటివరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాతే కో ఆప్టెడ్ సభ్యుల్ని, మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేవారు. పాత పాలక వర్గాల పదవీకాలం అయిపోగానే మొదటి సమావేశం నిర్వహించేవారు. ఇప్పుడు చట్ట సవరణతో మార్పులు వచ్చాయి. ఈ నెల 7న ఎంపీటీసీలు, 8న జడ్పీటీసీలు ప్రమాణం చేయకుండానే ప్రత్యేక సమావేశాల్లో పాల్గొని తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. కో- ఆప్టెడ్ సభ్యుల ఎంపికలో పార్టీ విప్ వర్తించదు.

ఇవీ చూడండి: పుర ఎన్నికలకు 2 రోజుల్లో అధికారిక ప్రకటన...!

Intro:Body:Conclusion:
Last Updated : Jun 6, 2019, 1:36 PM IST

For All Latest Updates

TAGGED:

zpelections
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.