భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మావోయిస్టులకు సాయపడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు మణుగూరు డీఎస్పీ ఆర్. సాయిబాబా తెలిపారు. మావోయిస్టులు తన సొంత ప్రయోజనాల కోసం అమాయక గిరిజనులను మాయ మాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. తుడుం దెబ్బ, మావోయిస్టు ఫ్రంట్ ఆర్గనైజేషన్ సంఘాల సాయంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ' రైతులు అప్పులు చేసే పరిస్థితే ఉండొద్దు'