ETV Bharat / state

రామయ్య సన్నిధిలో ధ్వజారోహణ ఉత్సవం - తెలంగాణ వార్తలు

రామయ్య సన్నిధిలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు అగ్ని మథనం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఈ వేడుకల ప్రాధాన్యాన్ని పండితులు వివరించారు.

bhadrachalam dwajarohanam, dwajarohanam in seetharamula swamy temple
సీతారాముల ఆలయంలో ధ్వజారోహణం, సీతారాముల కల్యాణం
author img

By

Published : Apr 19, 2021, 2:42 PM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. ముందుగా హోమశాలలో ఉన్న గరుడ పటాన్ని ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ధ్వజస్తంభం దగ్గరకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తూ వేద పఠనం చేశారు.

ఈ ధ్వజారోహణ గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయని పండితులు తెలిపారు. గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం గరుడ పటాన్ని ధ్వజస్తంభంపై ఎగరవేశారు. ఇవాళ ఉదయం అగ్ని మథనం, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆలయ వైదిక పెద్దలతో పాటు ఈవో శివాజీ, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. ముందుగా హోమశాలలో ఉన్న గరుడ పటాన్ని ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ధ్వజస్తంభం దగ్గరకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తూ వేద పఠనం చేశారు.

ఈ ధ్వజారోహణ గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయని పండితులు తెలిపారు. గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం గరుడ పటాన్ని ధ్వజస్తంభంపై ఎగరవేశారు. ఇవాళ ఉదయం అగ్ని మథనం, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆలయ వైదిక పెద్దలతో పాటు ఈవో శివాజీ, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: భద్రాద్రిలో వైభవంగా తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.