భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలోని రామవరంలో డెంగీ వ్యాధి లక్షణాలతో నాలుగో తరగతి చిన్నారి నక్షత్ర మృతిచెందింది. నక్షత్ర తండ్రి వీర నాగేంద్ర సింగరేణిలో కార్మికునిగా జీవనం సాగిస్తున్నాడు. నాలుగు రోజుల కిందట జ్వరంతో బాద పడుతున్న కుమార్తెను సింగరేణి ఆస్పత్రిలో చేర్పించాడు. జ్వరం తీవ్రత ఎక్కువ కావడం వల్ల హైదరాబాద్కు తరలించాలంటూ వైద్యులు సూచించారు. మార్గమధ్యలో పరిస్థితి విషమించి చిన్నారి నక్షత్ర తుదిశ్వాస విడిచింది.
పారిశుద్ధ్య లోపమే కారణం
తన కుమార్తె మరణానికి సింగరేణి అధికారుల నిర్లక్ష్య వైఖరే కారణమని వీర నాగేంద్ర ఆరోపించాడు. పారిశుద్ధ్య లోపంతో ప్రజలు అల్లాడిపోతున్నా పట్టించుకోవడం వాపోయాడు. సాక్షాత్రు ఆరోగ్య శాఖ మంత్రి పర్యటించి, సూచనలిచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదని మాజీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: లాంచీ ప్రమాద ఘటనలో పర్యటకుల వివరాలివే...!