కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు నెలకు రూ.6 వేల చొప్పున సంవత్సరానికి రూ.72 వేలు ఇస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాఠోడ్ అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామన్నారు. భాజపా, తెరాస మాటలు నమ్మి మోసపోకుండా చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా రమేశ్ కోరారు.
ఇవీ చూడండి: 'సైరా' తర్వాత చిరంజీవి చిత్రం ఇదే