ఆదిలాబాద్ జెడ్పీ వైస్ ఛైర్మన్ ఆరె రాజన్న కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. ఇటీవల ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ కాగా.. ఆదిలాబాద్లోని స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ కార్పోరేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆదిలాబాద్ మండలం చాందా గ్రామానికి చెందిన రాజన్న గ్రామ సర్పంచ్గా, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా పనిచేశారు. గత ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలుపొంది ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న సన్నిహితుల్లో రాజన్న ఒకరు. ఆయన మృతితో జోగు రామన్న విషాదంలో మునిగిపోయారు.
ఆదిలాబాద్ జెడ్పీ వైస్ ఛైర్మన్ కన్నుమూత!
కరోనాతో పోరాడుతూ ఆదిలాబాద్ జెడ్పీ వైస్ ఛైర్మన్ ఆరె రాజన్న హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెరాస తరఫున జెడ్పీటీసీగా గెలుపొందిన ఆయన జెడ్పీ వైస్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే జోగు రామన్నకు అత్యంత సన్నిహితుల్లో రాజన్న ఒకరు.
ఆదిలాబాద్ జెడ్పీ వైస్ ఛైర్మన్ ఆరె రాజన్న కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. ఇటీవల ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ కాగా.. ఆదిలాబాద్లోని స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ కార్పోరేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆదిలాబాద్ మండలం చాందా గ్రామానికి చెందిన రాజన్న గ్రామ సర్పంచ్గా, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా పనిచేశారు. గత ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలుపొంది ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న సన్నిహితుల్లో రాజన్న ఒకరు. ఆయన మృతితో జోగు రామన్న విషాదంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి: "నా సొరకాయలు పోయాయి సార్..!"