ETV Bharat / state

Adilabad DCCB: ఆదిలాబాద్​ డీసీసీబీ కుంభకోణంపై సీఐడీకి ఫిర్యాదు

Adilabad DCCB: ఆదిలాబాద్​ జిల్లా డీసీసీబీలో వెలుగుచూసిన కుంభకోణంపై బ్యాంకు అధికారులు సీఐడీకి ఫిర్యాదుచేశారు. అలాగే స్థానిక పోలీస్​స్టేషన్​లో నమోదైన కేసుపై మంగళవారం నుంచి దర్యాప్తు ప్రారంభమైంది.

author img

By

Published : Mar 16, 2022, 8:56 AM IST

Adilabad DCCB
Adilabad DCCB
Adilabad DCCB: ఆదిలాబాద్​ డీసీసీబీ కుంభకోణంపై సీఐడీకి ఫిర్యాదు

Adilabad DCCB: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్ర సహాకార బ్యాంకు (DCCB) బేల బ్రాంచిలో వెలుగుచూసిన 2 కోట్ల 86లక్షల రూపాయల కుంభకోణం కేసు సీఐడీ దృష్టికి వెళ్లింది. బ్యాంకు సొమ్ము దుర్వినియోగంలో భాగస్వాములైన 11 మంది ఉద్యోగులపై ఇప్పటికే సస్పెన్షన్‌ వేటు వేసిన డీసీసీబీ... తాజాగా సీఐడీకి ఫిర్యాదు చేసింది.

11 మంది సస్పెండ్​..

డీసీసీబీ బేల బ్రాంచిలో స్టాఫ్‌ అసిస్టెంట్​ కం క్యాషియర్‌గా పనిచేస్తున్న శ్రీపతికుమార్‌ ప్రధాన సూత్రధారిగా 2 కోట్ల 86 లక్షల 40 వేల రూపాయల దుర్వినియోగానికి పాల్పడడం రాష్ట్ర సహాకార వ్యవస్థలోనే సంచలనం సృష్టించింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం ప్రధాన సూత్రదారుడైన శ్రీపతికుమార్‌, బేల బ్రాంచి మేనేజర్‌ రాజేశ్వర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ రణిత సహా ఆదిలాబాద్‌ ప్రధాన కార్యాలయం, జన్నారం, భీంపూర్ బ్రాంచిల్లో పనిచేసే 11 మందిని సస్పెండ్‌ చేసింది. ఆర్‌బీఐ, నాబార్డు నిబంధనల ప్రకారం జిల్లాస్థాయిలో అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేల పోలీసు స్టేషన్‌లో నమ్మక ద్రోహం, మోసం కింద కేసు నమోదవగా మంగళవారం నుంచి విచారణ ప్రారంభమైంది.

అధికారులు ముందుగా అనుకున్నట్లుగా 2 కోట్ల 86 లక్షల 40వేల రూపాయలు దుర్వినియోగం అయినట్లు భావించినప్పటికీ.. లక్షా 40 వేల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు నిబంధనల ప్రకారమే జరిగినట్లు వోచర్లు లభించాయి. దాంతో 2 కోట్ల 85 లక్షలు దుర్వినియోగమైనట్లు తేల్చిన అధికారులు... వాటి ఆధారాలతో కూడిన ప్రాథమిక నివేదికలను జతపరుస్తూ.. హైదరాబాద్‌లో సీఐడీకి ఫిర్యాదు చేశారు. మరోపక్క బేల పోలీసుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఆర్థిక లావాదేవీలకు సంబందించిన రికార్డుల పరిశీలన ప్రారంభమైంది.

రూ.51 లక్షలు స్వాధీనం..

దుర్వినియోగమైన డబ్బుల నుంచి.. సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లోంచి అధికారులు ఇప్పటిదాకా రూ.51 లక్షల నగదు, డిపాజిట్లను స్వాధీనం చేసుకోగా, మిగిలిన డబ్బులను రాబట్టుకునే ప్రయత్నం కొనసాగుతోంది.

ఇవీచూడండి:

Adilabad DCCB: ఆదిలాబాద్​ డీసీసీబీ కుంభకోణంపై సీఐడీకి ఫిర్యాదు

Adilabad DCCB: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్ర సహాకార బ్యాంకు (DCCB) బేల బ్రాంచిలో వెలుగుచూసిన 2 కోట్ల 86లక్షల రూపాయల కుంభకోణం కేసు సీఐడీ దృష్టికి వెళ్లింది. బ్యాంకు సొమ్ము దుర్వినియోగంలో భాగస్వాములైన 11 మంది ఉద్యోగులపై ఇప్పటికే సస్పెన్షన్‌ వేటు వేసిన డీసీసీబీ... తాజాగా సీఐడీకి ఫిర్యాదు చేసింది.

11 మంది సస్పెండ్​..

డీసీసీబీ బేల బ్రాంచిలో స్టాఫ్‌ అసిస్టెంట్​ కం క్యాషియర్‌గా పనిచేస్తున్న శ్రీపతికుమార్‌ ప్రధాన సూత్రధారిగా 2 కోట్ల 86 లక్షల 40 వేల రూపాయల దుర్వినియోగానికి పాల్పడడం రాష్ట్ర సహాకార వ్యవస్థలోనే సంచలనం సృష్టించింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం ప్రధాన సూత్రదారుడైన శ్రీపతికుమార్‌, బేల బ్రాంచి మేనేజర్‌ రాజేశ్వర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ రణిత సహా ఆదిలాబాద్‌ ప్రధాన కార్యాలయం, జన్నారం, భీంపూర్ బ్రాంచిల్లో పనిచేసే 11 మందిని సస్పెండ్‌ చేసింది. ఆర్‌బీఐ, నాబార్డు నిబంధనల ప్రకారం జిల్లాస్థాయిలో అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేల పోలీసు స్టేషన్‌లో నమ్మక ద్రోహం, మోసం కింద కేసు నమోదవగా మంగళవారం నుంచి విచారణ ప్రారంభమైంది.

అధికారులు ముందుగా అనుకున్నట్లుగా 2 కోట్ల 86 లక్షల 40వేల రూపాయలు దుర్వినియోగం అయినట్లు భావించినప్పటికీ.. లక్షా 40 వేల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు నిబంధనల ప్రకారమే జరిగినట్లు వోచర్లు లభించాయి. దాంతో 2 కోట్ల 85 లక్షలు దుర్వినియోగమైనట్లు తేల్చిన అధికారులు... వాటి ఆధారాలతో కూడిన ప్రాథమిక నివేదికలను జతపరుస్తూ.. హైదరాబాద్‌లో సీఐడీకి ఫిర్యాదు చేశారు. మరోపక్క బేల పోలీసుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఆర్థిక లావాదేవీలకు సంబందించిన రికార్డుల పరిశీలన ప్రారంభమైంది.

రూ.51 లక్షలు స్వాధీనం..

దుర్వినియోగమైన డబ్బుల నుంచి.. సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లోంచి అధికారులు ఇప్పటిదాకా రూ.51 లక్షల నగదు, డిపాజిట్లను స్వాధీనం చేసుకోగా, మిగిలిన డబ్బులను రాబట్టుకునే ప్రయత్నం కొనసాగుతోంది.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.