ETV Bharat / sports

Tokyo Paralympics: భారత జోరుకు విరామం- నిరాశపరిచిన అథ్లెట్లు​

author img

By

Published : Sep 2, 2021, 7:02 AM IST

పారాలింపిక్స్‌లో(Tokyo Paralympics) వరుస పతకాలతో హోరెత్తించిన భారత పారా అథ్లెట్లు(Paralympics 2021 India).. బుధవారం ఉసూరుమనిపించారు. ఒక్క పతకం కూడా నెగ్గలేకపోయారు. పారాలింపిక్స్‌లో(Paralympics 2021) పసిడి నెగ్గిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన పారా షూటర్‌ అవని లెఖరా.. మిక్స్‌డ్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌1లో నిరాశపరిచింది. పురుషుల ఎఫ్‌51 క్లబ్‌త్రోలో భారత పారా అథ్లెట్లు అమిత్‌, ధరంబీర్‌ పతకం గెలవలేకపోయారు.

Tokyo Paralympics
టోక్యో పారాలింపిక్స్‌

టోక్యో పారాలింపిక్స్‌లో (Tokyo Paralympics) భారత జోరుకు విరామం. వరుస పతకాలతో హోరెత్తించిన మన పారా అథ్లెట్లు(Paralympics 2021 India).. బుధవారం ఉసూరుమనిపించారు. ఒక్క పతకం కూడా నెగ్గలేకపోయారు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలో స్వర్ణం సాధించి.. పారాలింపిక్స్‌లో(Paralympics 2021) పసిడి నెగ్గిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన పారా షూటర్‌ అవని లెఖరా.. మిక్స్‌డ్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌1లో నిరాశపరిచింది. ఈ 19 ఏళ్ల షూటర్‌ ఫైనల్‌ చేరడంలో విఫలమైంది. పురుషుల విభాగంలో సిద్ధార్థ, దీపక్‌ వరుసగా 40, 43వ స్థానాల్లో నిలిచారు. పురుషుల ఎఫ్‌51 క్లబ్‌త్రోలో భారత పారా అథ్లెట్లు అమిత్‌, ధరంబీర్‌ పతకం గెలవలేకపోయారు. 27.77 మీటర్ల దూరం విసిరిన అమిత్‌ అయిదో స్థానంలో, 26.63 మీటర్ల ప్రదర్శనతో ధరంబీర్‌ ఎనిమిదో స్థానంలో నిలిచారు.

బ్యాడ్మింటన్‌లో మిశ్రమం

పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 విభాగంలో ప్రపంచ నం.1 ప్రమోద్‌ భగత్‌ శుభారంభం చేశాడు. గ్రూప్‌- ఎ మ్యాచ్‌లో అతను 21-10, 21-23, 21-9 తేడాతో మనోజ్‌ సర్కార్‌పై గెలిచాడు.మహిళల సింగిల్స్‌ ఎస్‌యూ5లో 19 ఏళ్ల పలక్‌ కోహ్లి 4-21, 7-21తో అయాకో (జపాన్‌) చేతిలో పరాజయంపాలైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ గ్రూప్‌- బి మ్యాచ్‌లో ప్రమోద్‌- పలక్‌ జోడీ 9-21, 21-15, 19-21తో లుకాస్‌- ఫాస్టిన్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పరాజయం పాలైంది.

ఆలస్యం.. పసిడి దూరం

పారాలింపిక్స్‌లో (Tokyo Paralympics 2021) పతకం గెలవాలని ప్రతి పారా అథ్లెట్‌ కల కంటాడు. అలాంటిది చేతికి అందివచ్చిన పతకం.. మెడలో వాలకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడలాంటి బాధనే మలేషియా షాట్‌పుట్‌ అథ్లెట్‌ మహమ్మద్‌ జియాద్‌ అనుభవిస్తున్నాడు. మంగళవారం పురుషుల ఎఫ్‌20 షాట్‌పుట్‌ పోటీలకు జియాద్‌తో పాటు మరో ఇద్దరు అథ్లెట్లు మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. దీంతో పోటీపడేందుకు వాళ్లను నిర్వాహకులు అనుమతించలేదు. కానీ ఆ అథ్లెట్లు ఆందోళనకు దిగడంతో అప్పటికప్పుడు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించి.. ఆలస్యానికి గల కారణంపై విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఆ పోటీల్లో జియాద్‌ స్వర్ణం గెలిచాడు. కానీ ఈ విషయంపై విచారణ జరిపిన పారాలింపిక్‌ కమిటీ ఆ అథ్లెట్లు ఆలస్యంగా రావడానికి సహేతుకమైన కారణమేదీ లేదని తేల్చి వాళ్లపై అనర్హత వేటు వేసింది. దీంతో జియాద్‌కు పసిడి దక్కలేదు. అతని తర్వాతి స్థానంలో నిలిచిన మక్సీమ్‌కు స్వర్ణం లభించింది.

ఇదీ చూడండి: Tokyo Paralympics: విధిని జయించి 'విజేత'గా నిలిచారు

టోక్యో పారాలింపిక్స్‌లో (Tokyo Paralympics) భారత జోరుకు విరామం. వరుస పతకాలతో హోరెత్తించిన మన పారా అథ్లెట్లు(Paralympics 2021 India).. బుధవారం ఉసూరుమనిపించారు. ఒక్క పతకం కూడా నెగ్గలేకపోయారు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలో స్వర్ణం సాధించి.. పారాలింపిక్స్‌లో(Paralympics 2021) పసిడి నెగ్గిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన పారా షూటర్‌ అవని లెఖరా.. మిక్స్‌డ్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌1లో నిరాశపరిచింది. ఈ 19 ఏళ్ల షూటర్‌ ఫైనల్‌ చేరడంలో విఫలమైంది. పురుషుల విభాగంలో సిద్ధార్థ, దీపక్‌ వరుసగా 40, 43వ స్థానాల్లో నిలిచారు. పురుషుల ఎఫ్‌51 క్లబ్‌త్రోలో భారత పారా అథ్లెట్లు అమిత్‌, ధరంబీర్‌ పతకం గెలవలేకపోయారు. 27.77 మీటర్ల దూరం విసిరిన అమిత్‌ అయిదో స్థానంలో, 26.63 మీటర్ల ప్రదర్శనతో ధరంబీర్‌ ఎనిమిదో స్థానంలో నిలిచారు.

బ్యాడ్మింటన్‌లో మిశ్రమం

పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 విభాగంలో ప్రపంచ నం.1 ప్రమోద్‌ భగత్‌ శుభారంభం చేశాడు. గ్రూప్‌- ఎ మ్యాచ్‌లో అతను 21-10, 21-23, 21-9 తేడాతో మనోజ్‌ సర్కార్‌పై గెలిచాడు.మహిళల సింగిల్స్‌ ఎస్‌యూ5లో 19 ఏళ్ల పలక్‌ కోహ్లి 4-21, 7-21తో అయాకో (జపాన్‌) చేతిలో పరాజయంపాలైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ గ్రూప్‌- బి మ్యాచ్‌లో ప్రమోద్‌- పలక్‌ జోడీ 9-21, 21-15, 19-21తో లుకాస్‌- ఫాస్టిన్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పరాజయం పాలైంది.

ఆలస్యం.. పసిడి దూరం

పారాలింపిక్స్‌లో (Tokyo Paralympics 2021) పతకం గెలవాలని ప్రతి పారా అథ్లెట్‌ కల కంటాడు. అలాంటిది చేతికి అందివచ్చిన పతకం.. మెడలో వాలకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడలాంటి బాధనే మలేషియా షాట్‌పుట్‌ అథ్లెట్‌ మహమ్మద్‌ జియాద్‌ అనుభవిస్తున్నాడు. మంగళవారం పురుషుల ఎఫ్‌20 షాట్‌పుట్‌ పోటీలకు జియాద్‌తో పాటు మరో ఇద్దరు అథ్లెట్లు మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. దీంతో పోటీపడేందుకు వాళ్లను నిర్వాహకులు అనుమతించలేదు. కానీ ఆ అథ్లెట్లు ఆందోళనకు దిగడంతో అప్పటికప్పుడు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించి.. ఆలస్యానికి గల కారణంపై విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఆ పోటీల్లో జియాద్‌ స్వర్ణం గెలిచాడు. కానీ ఈ విషయంపై విచారణ జరిపిన పారాలింపిక్‌ కమిటీ ఆ అథ్లెట్లు ఆలస్యంగా రావడానికి సహేతుకమైన కారణమేదీ లేదని తేల్చి వాళ్లపై అనర్హత వేటు వేసింది. దీంతో జియాద్‌కు పసిడి దక్కలేదు. అతని తర్వాతి స్థానంలో నిలిచిన మక్సీమ్‌కు స్వర్ణం లభించింది.

ఇదీ చూడండి: Tokyo Paralympics: విధిని జయించి 'విజేత'గా నిలిచారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.