తమను ఆదుకోవాలంటూ బీసీసీఐ(BCCI) అధ్యక్షుడు గంగూలీకి(Ganguly) మెయిల్ ద్వారా ఓ వినతి పత్రాన్ని అందించారు బోర్డుకు చెందిన మాజీ స్కోరర్లు. పదవీ విరమణ ప్రయోజనాలు, వయసు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ముంబయి క్రికెట్ అసోసియేషన్ స్కోరర్ వివేక్ గుప్తా ఆధ్వర్యంలో మొత్తంగా 17మంది స్కోరర్లు కలిసి ఈ ప్రతిపాదనను దాదా ముందు ఉంచారు. కరోనా కాలంలో చాలామంది వర్ధమాన, ప్రస్తుత స్కోరర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.
ఇదీ చూడండి T20 WC: ఐసీసీని గడువు కోరనున్న బీసీసీఐ!