ETV Bharat / sports

విరాట్​ కోహ్లీ ఘనత.. సచిన్​ను అధిగమించి వరల్డ్​ రికార్డ్..!

author img

By

Published : Feb 19, 2023, 4:43 PM IST

టీమ్ఇండియా స్టార్​ ప్లేయర్​ విరాట్​ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్​ తెందుల్కర్ రికార్డును బద్దలుగొట్టాడు. దిల్లీ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో రాణించి.. ఈ ఫీట్​ సాధించాడు విరాట్​ కోహ్లీ. ఈ వివరాలు..

virat fastest to score 25000 international runs
virat fastest to score 25000 international runs

టీమ్ఇండియా స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ రికార్డు బద్దలుగొట్టాడు. దిల్లీ వేదికగా బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో విరాట్​ రాణించాడు. టీమ్ఇండియా తొలి, రెండో ఇన్నింగ్స్​లో 44, 20 పరుగులు చేశాడు. దీంతో, ఇంటర్నేషనల్​ క్రికెట్​లో అత్యంత వేగంగా 25,000 పరుగులు సాధించిన ప్లేయర్​గా సరికొత్త రికార్డు క్రియేట్​ చేశాడు విరాట్​ కోహ్లీ. ఇదివరకు ఈ రికార్డు టీమ్​ఇండి మాజీ క్రికెటర్​ మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందుల్కర్​ పేరిట ఉండేది.

ఈ ఫీట్​ను కోహ్లీ 549 ఇన్నింగ్స్​లో పూర్తి చేయాగా.. 25,000 పరుగులు పూర్తి చేయడానికి సచిన్​ తెందుల్కర్​కు 579 ఇన్నింగ్స్​లు​ పట్టాయి. ఇప్పటివరకు కోహ్లీ.. వన్డేల్లో 12,809 సాధించాడు. టెస్టుల్లో 8,495.. టీ20ల్లో 4008 పరుగులు చేశాడు. తాజాగా ఆసీస్​తో జరిగిన రెండో టెస్టులో 20 పరుగులు చేసి.. మొత్తంగా 25,012 పరుగులు పూర్తి చేశాడు. ఇక. అత్యంత వేగంగా 25 వేల పరుగుల పూర్తి చేసిన లిస్టులో విరాట్​ కోహ్లీ, సచిన్​ తెందుల్కర్ తర్వాత ​స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్​ రికీ పాంటింగ్​..(588 ఇన్నింగ్స్​), జాక్స్​ కాలిస్(594 ఇన్నింగ్స్), కుమార సంగాక్కర(608 ఇన్నింగ్స్), మహేల జయవర్ధనే(701 ఇన్నింగ్స్) ఉన్నారు. ఇదే కాకుండా వన్డేల్లో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్​గా ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.
కాగా, దిల్లీ వేదికగా భారత్​ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్​లో కొంచెం తడబడ్డా.. రెండో ఇన్నింగ్స్​లో పుంజుకుంది. కంగారూ బ్యాటర్లును భారత బౌలర్లలు అష్టదిగ్బంధనం చేసి రెండో ఇన్నింగ్స్​లో ఆసీస్​ను 113 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు.

  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​ : 263/10
  • ఇండియా తొలి ఇన్నింగ్స్​ : 262/10
  • ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్​ : 113/10
  • ఇండియా రెండో ఇన్నింగ్స్​ : 118/4

టీమ్ఇండియా స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ రికార్డు బద్దలుగొట్టాడు. దిల్లీ వేదికగా బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో విరాట్​ రాణించాడు. టీమ్ఇండియా తొలి, రెండో ఇన్నింగ్స్​లో 44, 20 పరుగులు చేశాడు. దీంతో, ఇంటర్నేషనల్​ క్రికెట్​లో అత్యంత వేగంగా 25,000 పరుగులు సాధించిన ప్లేయర్​గా సరికొత్త రికార్డు క్రియేట్​ చేశాడు విరాట్​ కోహ్లీ. ఇదివరకు ఈ రికార్డు టీమ్​ఇండి మాజీ క్రికెటర్​ మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందుల్కర్​ పేరిట ఉండేది.

ఈ ఫీట్​ను కోహ్లీ 549 ఇన్నింగ్స్​లో పూర్తి చేయాగా.. 25,000 పరుగులు పూర్తి చేయడానికి సచిన్​ తెందుల్కర్​కు 579 ఇన్నింగ్స్​లు​ పట్టాయి. ఇప్పటివరకు కోహ్లీ.. వన్డేల్లో 12,809 సాధించాడు. టెస్టుల్లో 8,495.. టీ20ల్లో 4008 పరుగులు చేశాడు. తాజాగా ఆసీస్​తో జరిగిన రెండో టెస్టులో 20 పరుగులు చేసి.. మొత్తంగా 25,012 పరుగులు పూర్తి చేశాడు. ఇక. అత్యంత వేగంగా 25 వేల పరుగుల పూర్తి చేసిన లిస్టులో విరాట్​ కోహ్లీ, సచిన్​ తెందుల్కర్ తర్వాత ​స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్​ రికీ పాంటింగ్​..(588 ఇన్నింగ్స్​), జాక్స్​ కాలిస్(594 ఇన్నింగ్స్), కుమార సంగాక్కర(608 ఇన్నింగ్స్), మహేల జయవర్ధనే(701 ఇన్నింగ్స్) ఉన్నారు. ఇదే కాకుండా వన్డేల్లో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్​గా ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.
కాగా, దిల్లీ వేదికగా భారత్​ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్​లో కొంచెం తడబడ్డా.. రెండో ఇన్నింగ్స్​లో పుంజుకుంది. కంగారూ బ్యాటర్లును భారత బౌలర్లలు అష్టదిగ్బంధనం చేసి రెండో ఇన్నింగ్స్​లో ఆసీస్​ను 113 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు.

  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​ : 263/10
  • ఇండియా తొలి ఇన్నింగ్స్​ : 262/10
  • ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్​ : 113/10
  • ఇండియా రెండో ఇన్నింగ్స్​ : 118/4
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.