ETV Bharat / sports

IND vs PAK: 'ఒత్తిడిని ఎదుర్కోవాలంటే భారత్‌తో ఆడాలి'

author img

By

Published : Jul 11, 2021, 11:00 PM IST

పాక్ ఆటగాళ్లు ఒత్తిడిని జయించాలంటే.. వారు టీమ్​ఇండియాతో ఆడాలని పాక్ ఫాస్ట్ బౌలర్ జునైద్‌ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లుండవని అంచనా వేశాడు.

team india
భారత్‌ జట్టు

పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొనేలా సన్నద్ధమవ్వాలంటే టీమ్‌ఇండియాతో ఆడాలని ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్‌ జునైద్‌ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు ఒక స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సమీప భవిష్యత్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లుండవని అంచనా వేశాడు.

వారే సరైనోళ్లు..

"పాక్‌ ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొనేలా సన్నద్ధమవ్వాలంటే టీమ్‌ఇండియాతో ఆడాలి. రెండు జట్లపైనా ఒత్తిడనేది చాలా ఉంటుంది. ఆ వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇరు దేశాల మధ్య క్రమం తప్పకుండా క్రికెట్ జరగాలని నేను ఆశిస్తున్నాను. కానీ.. పరిస్థితులను చూస్తే సమీప భవిష్యత్‌లో అది జరిగేలా అనిపించడం లేదు. అలాగే నేను 2012-13లో టీమ్‌ఇండియా పర్యటనకు వెళ్లినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. అప్పుడే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నా. దాంతో భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగితే ఇరు జట్ల ఆటగాళ్లకు చాలా మంచిది. అది రెండు దేశాల అభిమానులను సంతోషపెడుతుంది" అని పాక్‌ పేసర్‌ చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్‌ చివరిసారి భారత్‌లో పర్యటించినప్పుడు ఆ జట్టు 2-1 తేడాతో వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది. అందులో జునైద్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించాడు. ఆ మూడు వన్డేల్లో అతడు విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేయడం విశేషం. ఆ సిరీస్‌లో కోహ్లీ మొత్తం 13 పరుగులే చేశాడు.

ఆ పర్యటన తర్వాత ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా దాయాది జట్లు ఐసీసీ ఈవెంట్లు, లేదా ఆసియాకప్‌లో పోటీపడుతున్నాయి. చివరగా 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ చిరకాల ప్రత్యర్థిని ఓడించారు.

ఇదీ చదవండి : ENG vs PAK: ఇలాంటి ఆటతో భావి తరాలకు ఏం చెప్తారు?

పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొనేలా సన్నద్ధమవ్వాలంటే టీమ్‌ఇండియాతో ఆడాలని ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్‌ జునైద్‌ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు ఒక స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సమీప భవిష్యత్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లుండవని అంచనా వేశాడు.

వారే సరైనోళ్లు..

"పాక్‌ ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొనేలా సన్నద్ధమవ్వాలంటే టీమ్‌ఇండియాతో ఆడాలి. రెండు జట్లపైనా ఒత్తిడనేది చాలా ఉంటుంది. ఆ వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇరు దేశాల మధ్య క్రమం తప్పకుండా క్రికెట్ జరగాలని నేను ఆశిస్తున్నాను. కానీ.. పరిస్థితులను చూస్తే సమీప భవిష్యత్‌లో అది జరిగేలా అనిపించడం లేదు. అలాగే నేను 2012-13లో టీమ్‌ఇండియా పర్యటనకు వెళ్లినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. అప్పుడే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నా. దాంతో భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగితే ఇరు జట్ల ఆటగాళ్లకు చాలా మంచిది. అది రెండు దేశాల అభిమానులను సంతోషపెడుతుంది" అని పాక్‌ పేసర్‌ చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్‌ చివరిసారి భారత్‌లో పర్యటించినప్పుడు ఆ జట్టు 2-1 తేడాతో వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది. అందులో జునైద్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించాడు. ఆ మూడు వన్డేల్లో అతడు విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేయడం విశేషం. ఆ సిరీస్‌లో కోహ్లీ మొత్తం 13 పరుగులే చేశాడు.

ఆ పర్యటన తర్వాత ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా దాయాది జట్లు ఐసీసీ ఈవెంట్లు, లేదా ఆసియాకప్‌లో పోటీపడుతున్నాయి. చివరగా 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ చిరకాల ప్రత్యర్థిని ఓడించారు.

ఇదీ చదవండి : ENG vs PAK: ఇలాంటి ఆటతో భావి తరాలకు ఏం చెప్తారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.