ETV Bharat / sports

IPL 2022: రేసులోనే చెన్నై.. ఫ్లేఆఫ్స్​ చేరే జట్లు ఏవి?

author img

By

Published : Apr 26, 2022, 7:58 AM IST

Updated : Apr 26, 2022, 10:35 AM IST

IPL 2022: ఐపీఎల్​ 2022లో గొప్ప పేరున్న జట్లు తేలిపోగా ఏమాత్రం అంచనాల్లేని జట్లు చెలరేగిపోతున్నాయి. టోర్నీ ప్రారంభమై నెల కావొస్తుంది. ఈ మెగా సందడి మరో 30 రోజులకు పైగా సాగనుంది. ఇప్పటికే 38 మ్యాచ్‌లు పూర్తవ్వగా ఇంకా 33 మ్యాచ్‌లు మిగిలున్నాయి. అయితే అప్పుడే ప్లేఆఫ్స్‌ చేరే జట్లేవో ఓ అంచనా వచ్చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరెవరు ప్లేఆఫ్స్‌ చేరే అవకాశం ఉందో చూద్దాం..

ipl 2022 playoffs teams
IPL 2022

IPL 2022: ఐపీఎల్​లో ప్రతి సీజన్‌లాగే ఈసారి కూడా ఏ జట్టు అయినా ప్లేఆఫ్స్‌ చేరాలంటే కనీసం 14 పాయింట్లు సాధించాలి. అంటే ఏడు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. ఒకవేళ నాలుగు కన్నా ఎక్కువ జట్లు 14 పాయింట్లు సాధిస్తే అప్పుడు నెట్‌రన్‌రేట్‌ కీలకంగా మారుతుంది. ఎవరు మెరుగ్గా ఉంటే వాళ్లే నాకౌట్‌ దశకు చేరుకుంటారు. మరోవైపు ఇప్పటికే అన్ని జట్లు 7, 8 మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా ముంబయి మినహా మిగతావన్నీ ప్లేఆఫ్స్‌ చేరుకునే అవకాశాలున్నాయి. ఇందులో గుజరాత్‌, హైదరాబాద్‌, రాజస్థాన్‌ తేలిగ్గా చేరుకునే వీలుంది. దీంతో ఎవరి పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

గుజరాత్‌: ఏమాత్రం అంచనాల్లేని కొత్త జట్టు గుజరాత్‌ ఇప్పటికే ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి టాప్‌లో దూసుకుపోతోంది. 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు ఆ జట్టు బలం చూస్తోంటే ఇకపై ఆడాల్సిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 3 గెలిచినా చాలు. అప్పుడు మొత్తం 18 పాయింట్లతో నిలిచే అవకాశం ఉంది. దీంతో తేలిగ్గానే ప్లేఆఫ్స్‌ చేరుతుంది.

హైదరాబాద్‌: తొలి రెండు ఓటముల తర్వాత అనూహ్యంగా పుంజుకున్న హైదరాబాద్‌ వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచి 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆడాల్సినవి ఇంకా 7 మ్యాచ్‌లు ఉన్నాయి. వీటిల్లో కనీసం మూడు గెలిచినా 16 పాయింట్లతో నిలుస్తుంది. దాంతో హైదరాబాద్‌ అవకాశాలకు ఢోకా లేదు.

రాజస్థాన్‌: హైదరాబాద్‌లాగే రాజస్థాన్‌ కూడా ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించింది. కానీ, రన్‌రేట్‌ పరంగా కాస్త వెనుకపడటంతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఇకపై ఆడాల్సిన 7 మ్యాచ్‌ల్లో ఈ జట్టు 3 గెలిచినా 16 పాయింట్లతో టాప్‌ ఫోర్‌లో చోటు దక్కించుకునే వీలుంది.

లఖ్‌నవూ: గుజరాత్‌లాగే ఈసారి కొత్తగా వచ్చిన జట్టు లఖ్‌నవూ. ఇది కూడా బాగా రాణించడం విశేషం. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి మొత్తం 10 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇకపై ఆడాల్సిన 6 మ్యాచ్‌ల్లో సగం గెలిచినా ప్లేఆఫ్స్‌ చేరుతుంది. కానీ, అప్పుడు ఇతర జట్ల నుంచి గట్టి పోటీ ఎదురుయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు లఖ్‌నవూ వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించాలి.

బెంగళూరు: లఖ్‌నవూలాగే బెంగళూరు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి ప్రస్తుతం ఐదో స్థానంలో నిలిచింది. అయితే, రన్‌రేట్‌ పరంగా వెనుకపడిపోవడం ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇకపై ఆడాల్సిన 6 మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచి రన్‌రేట్‌ మెరుగు పర్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే తర్వాతి స్థానాల్లో ఉన్న దిల్లీ, కోల్‌కతా, పంజాబ్‌ జట్లు దీన్ని వెనక్కినెట్టే ప్రమాదం లేకపోలేదు.

పంజాబ్‌: ఏటా ప్లేఆఫ్స్ కూడా చేరకుండా తీవ్ర నిరాశతో ఇంటిముఖం పట్టే పంజాబ్‌ ప్రదర్శన ఈ సారి మిశ్రమంగా ఉంది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించింది. దీంతో 8 పాయింట్లు తన ఖాతాలో వేసుకొని ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు ఈ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్‌ల్లో కనీసం మూడు విజయాలు సాధించాలి. అప్పుడే ప్లేఆఫ్స్‌ రేసులో నిలుస్తుంది. అయితే, నిలకడలేమి ప్రదర్శన ఆ జట్టు అవకాశాలను దెబ్బతీసే వీలుంది.

దిల్లీ: గత కొద్ది సీజన్ల నుంచి వరుసగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటున్న దిల్లీ ఈసారి కొంచెం గాడితప్పినట్లు అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలే సాధించి 6 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఇంకా ఆడాల్సిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 4 గెలిస్తే చివరికి 14 పాయింట్లు సాధిస్తుంది. కానీ, అంతటితో సరిపెట్టుకుంటే టాప్‌ ఫోర్‌లో నిలవడం చాలా కష్టం. కాబట్టి ఇది కూడా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు సొంతం చేసుకోవాలి.

కోల్‌కతా: గతేడాది రన్నరప్‌గా నిలిచిన కోల్‌కతాపై భారీ అంచనాలున్నా ఈ సీజన్‌లో పూర్తిగా తడబడినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలే సాధించి 6 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. దీంతో కోల్‌కతా ప్లేఆఫ్స్‌లో ఉండాలంటే మిగిలిన 6 మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు గెలవాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తన శక్తికి మించి పోరాడాలి.

చెన్నై: డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై ప్రస్తుతం ఆడిన 8 మ్యాచ్‌ల్లో 2 విజయాలే సాధించి కేవలం 4 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇంకా చెన్నై ప్లేఆఫ్స్‌ ఆవకాశాలు సజీవంగా ఉన్నాయి. అయితే చెన్నై తన 6 మ్యాచుల్లో 5 గెలవాలి. అప్పుడు ప్లేఆఫ్స్‌ రేసులో ఉంటుంది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆరింట్లో 5 గెలవడం జడేజా సేనకు కష్టమే. ఒకవేళ సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలిచి ఉంటే అవకాశాలు మెరుగ్గా ఉండేవి. కానీ ఆ మ్యాచ్‌లో చెన్నై గెలిచే అవకాశం ఉన్నప్పటికీ చివరలో చేతులెత్తేసింది.

ముంబయి: ముంబయి ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడినా ఇంకా ఖాతా తెరవలేదు. తాజాగా లఖ్‌నవూతో ఆడిన మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంతో ఆ జట్టు అవకాశాలన్నీ పూర్తిగా మూసుకుపోయాయి. ఇకపై ఆడాల్సిన 6 మ్యాచ్‌లు గెలిచినా అది ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం లేదు. కానీ, అనూహ్యంగా పుంజుకొని మూడు, నాలుగు విజయాలు సాధించినా.. దాని ప్రభావం ఇతర జట్లపై పడుతుంది. కాబట్టి ఒక విధంగా ముంబయి నుంచి వేరే జట్లకూ ప్రమాదం పొంచి ఉంది.

ఇదీ చూడండి: IPL 2022: పంజాబ్ నాలుగో విజయం.. చెన్నై మళ్లీ ఓటమి బాట..

IPL 2022: ఐపీఎల్​లో ప్రతి సీజన్‌లాగే ఈసారి కూడా ఏ జట్టు అయినా ప్లేఆఫ్స్‌ చేరాలంటే కనీసం 14 పాయింట్లు సాధించాలి. అంటే ఏడు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. ఒకవేళ నాలుగు కన్నా ఎక్కువ జట్లు 14 పాయింట్లు సాధిస్తే అప్పుడు నెట్‌రన్‌రేట్‌ కీలకంగా మారుతుంది. ఎవరు మెరుగ్గా ఉంటే వాళ్లే నాకౌట్‌ దశకు చేరుకుంటారు. మరోవైపు ఇప్పటికే అన్ని జట్లు 7, 8 మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా ముంబయి మినహా మిగతావన్నీ ప్లేఆఫ్స్‌ చేరుకునే అవకాశాలున్నాయి. ఇందులో గుజరాత్‌, హైదరాబాద్‌, రాజస్థాన్‌ తేలిగ్గా చేరుకునే వీలుంది. దీంతో ఎవరి పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

గుజరాత్‌: ఏమాత్రం అంచనాల్లేని కొత్త జట్టు గుజరాత్‌ ఇప్పటికే ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి టాప్‌లో దూసుకుపోతోంది. 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు ఆ జట్టు బలం చూస్తోంటే ఇకపై ఆడాల్సిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 3 గెలిచినా చాలు. అప్పుడు మొత్తం 18 పాయింట్లతో నిలిచే అవకాశం ఉంది. దీంతో తేలిగ్గానే ప్లేఆఫ్స్‌ చేరుతుంది.

హైదరాబాద్‌: తొలి రెండు ఓటముల తర్వాత అనూహ్యంగా పుంజుకున్న హైదరాబాద్‌ వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచి 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆడాల్సినవి ఇంకా 7 మ్యాచ్‌లు ఉన్నాయి. వీటిల్లో కనీసం మూడు గెలిచినా 16 పాయింట్లతో నిలుస్తుంది. దాంతో హైదరాబాద్‌ అవకాశాలకు ఢోకా లేదు.

రాజస్థాన్‌: హైదరాబాద్‌లాగే రాజస్థాన్‌ కూడా ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించింది. కానీ, రన్‌రేట్‌ పరంగా కాస్త వెనుకపడటంతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఇకపై ఆడాల్సిన 7 మ్యాచ్‌ల్లో ఈ జట్టు 3 గెలిచినా 16 పాయింట్లతో టాప్‌ ఫోర్‌లో చోటు దక్కించుకునే వీలుంది.

లఖ్‌నవూ: గుజరాత్‌లాగే ఈసారి కొత్తగా వచ్చిన జట్టు లఖ్‌నవూ. ఇది కూడా బాగా రాణించడం విశేషం. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి మొత్తం 10 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇకపై ఆడాల్సిన 6 మ్యాచ్‌ల్లో సగం గెలిచినా ప్లేఆఫ్స్‌ చేరుతుంది. కానీ, అప్పుడు ఇతర జట్ల నుంచి గట్టి పోటీ ఎదురుయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు లఖ్‌నవూ వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించాలి.

బెంగళూరు: లఖ్‌నవూలాగే బెంగళూరు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి ప్రస్తుతం ఐదో స్థానంలో నిలిచింది. అయితే, రన్‌రేట్‌ పరంగా వెనుకపడిపోవడం ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇకపై ఆడాల్సిన 6 మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచి రన్‌రేట్‌ మెరుగు పర్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే తర్వాతి స్థానాల్లో ఉన్న దిల్లీ, కోల్‌కతా, పంజాబ్‌ జట్లు దీన్ని వెనక్కినెట్టే ప్రమాదం లేకపోలేదు.

పంజాబ్‌: ఏటా ప్లేఆఫ్స్ కూడా చేరకుండా తీవ్ర నిరాశతో ఇంటిముఖం పట్టే పంజాబ్‌ ప్రదర్శన ఈ సారి మిశ్రమంగా ఉంది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించింది. దీంతో 8 పాయింట్లు తన ఖాతాలో వేసుకొని ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు ఈ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్‌ల్లో కనీసం మూడు విజయాలు సాధించాలి. అప్పుడే ప్లేఆఫ్స్‌ రేసులో నిలుస్తుంది. అయితే, నిలకడలేమి ప్రదర్శన ఆ జట్టు అవకాశాలను దెబ్బతీసే వీలుంది.

దిల్లీ: గత కొద్ది సీజన్ల నుంచి వరుసగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటున్న దిల్లీ ఈసారి కొంచెం గాడితప్పినట్లు అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలే సాధించి 6 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఇంకా ఆడాల్సిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 4 గెలిస్తే చివరికి 14 పాయింట్లు సాధిస్తుంది. కానీ, అంతటితో సరిపెట్టుకుంటే టాప్‌ ఫోర్‌లో నిలవడం చాలా కష్టం. కాబట్టి ఇది కూడా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు సొంతం చేసుకోవాలి.

కోల్‌కతా: గతేడాది రన్నరప్‌గా నిలిచిన కోల్‌కతాపై భారీ అంచనాలున్నా ఈ సీజన్‌లో పూర్తిగా తడబడినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలే సాధించి 6 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. దీంతో కోల్‌కతా ప్లేఆఫ్స్‌లో ఉండాలంటే మిగిలిన 6 మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు గెలవాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తన శక్తికి మించి పోరాడాలి.

చెన్నై: డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై ప్రస్తుతం ఆడిన 8 మ్యాచ్‌ల్లో 2 విజయాలే సాధించి కేవలం 4 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇంకా చెన్నై ప్లేఆఫ్స్‌ ఆవకాశాలు సజీవంగా ఉన్నాయి. అయితే చెన్నై తన 6 మ్యాచుల్లో 5 గెలవాలి. అప్పుడు ప్లేఆఫ్స్‌ రేసులో ఉంటుంది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆరింట్లో 5 గెలవడం జడేజా సేనకు కష్టమే. ఒకవేళ సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలిచి ఉంటే అవకాశాలు మెరుగ్గా ఉండేవి. కానీ ఆ మ్యాచ్‌లో చెన్నై గెలిచే అవకాశం ఉన్నప్పటికీ చివరలో చేతులెత్తేసింది.

ముంబయి: ముంబయి ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడినా ఇంకా ఖాతా తెరవలేదు. తాజాగా లఖ్‌నవూతో ఆడిన మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంతో ఆ జట్టు అవకాశాలన్నీ పూర్తిగా మూసుకుపోయాయి. ఇకపై ఆడాల్సిన 6 మ్యాచ్‌లు గెలిచినా అది ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం లేదు. కానీ, అనూహ్యంగా పుంజుకొని మూడు, నాలుగు విజయాలు సాధించినా.. దాని ప్రభావం ఇతర జట్లపై పడుతుంది. కాబట్టి ఒక విధంగా ముంబయి నుంచి వేరే జట్లకూ ప్రమాదం పొంచి ఉంది.

ఇదీ చూడండి: IPL 2022: పంజాబ్ నాలుగో విజయం.. చెన్నై మళ్లీ ఓటమి బాట..

Last Updated : Apr 26, 2022, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.