ETV Bharat / sports

WTC final : 'ఒకటి కాదు మూడు 'ఫైనల్స్' పెట్టాలి'

author img

By

Published : May 27, 2021, 3:16 PM IST

టెస్టు ఛాంపియన్​షిప్ విజేత ఎవరో నిర్ణయించేందుకు మూడు మ్యాచ్​లు పెట్టాలని అభిప్రాయపడ్డారు దిగ్గజ కపిల్​దేవ్. ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోందని అన్నారు.

India vs New Zealand WTC final
ఇండియా న్యూజిలాండ్

త్వరలో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్(WTC final) విజేతను తేల్చేందుకు మూడు మ్యాచ్​లు ఉండాలని దిగ్గజ క్రికెటర్ కపిల్​దేవ్ అభిప్రాయపడ్డారు. ఇది ఈరోజుల్లో ఏమంత పెద్ద విషయం కాదని చెప్పారు. అయితే టెస్టు మ్యాచ్​ల పట్ల ప్రజల్లో ఆసక్తి కలిగించేందుకు తెచ్చిన ఈ విధానంపై ఐసీసీని మెచ్చుకోవాల్సిందేనని అన్నారు.

kapil dev
కపిల్ దేవ్

బౌలర్ల కంటే బ్యాట్స్​మెన్​ గొప్ప అని తాను అనుకోవట్లేదని కపిల్​దేవ్ చెప్పారు. ప్రస్తుతం టీమ్​ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తున్నప్పటికీ, పిచ్​ పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడతారనేది ముఖ్యమని అన్నారు.

భారత్-న్యూజిలాండ్(India vs New Zealand) తలపడనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్.. జూన్ 18న సౌతాంప్టన్​ వేదికగా జరగనుంది. ఇందుకోసం త్వరలో ఇంగ్లాండ్​కు కోహ్లీసేన పయనం కానుంది.

ఇది చదవండి: WTC Final: పంత్​ను హెచ్చరించిన కపిల్​దేవ్​

త్వరలో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్(WTC final) విజేతను తేల్చేందుకు మూడు మ్యాచ్​లు ఉండాలని దిగ్గజ క్రికెటర్ కపిల్​దేవ్ అభిప్రాయపడ్డారు. ఇది ఈరోజుల్లో ఏమంత పెద్ద విషయం కాదని చెప్పారు. అయితే టెస్టు మ్యాచ్​ల పట్ల ప్రజల్లో ఆసక్తి కలిగించేందుకు తెచ్చిన ఈ విధానంపై ఐసీసీని మెచ్చుకోవాల్సిందేనని అన్నారు.

kapil dev
కపిల్ దేవ్

బౌలర్ల కంటే బ్యాట్స్​మెన్​ గొప్ప అని తాను అనుకోవట్లేదని కపిల్​దేవ్ చెప్పారు. ప్రస్తుతం టీమ్​ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తున్నప్పటికీ, పిచ్​ పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడతారనేది ముఖ్యమని అన్నారు.

భారత్-న్యూజిలాండ్(India vs New Zealand) తలపడనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్.. జూన్ 18న సౌతాంప్టన్​ వేదికగా జరగనుంది. ఇందుకోసం త్వరలో ఇంగ్లాండ్​కు కోహ్లీసేన పయనం కానుంది.

ఇది చదవండి: WTC Final: పంత్​ను హెచ్చరించిన కపిల్​దేవ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.