టీమ్ఇండియాపై ఇంగ్లాండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో సెషన్లోనూ ఆ జట్టు మెరుగైన ఆటతీరు ప్రదర్శించింది. కెప్టెన్ జో రూట్(80*), డేవిడ్ మలన్(70) మూడో వికెట్కు 139 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఆ జట్టు టీ బ్రేక్ సమయానికి 94 ఓవర్లలో 298/3తో నిలిచింది. ఈ సెషన్ ముగిసేముందు సిరాజ్ బౌలింగ్లో మలన్ ఔటయ్యాడు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు ఆధిక్యం 220 పరుగులుగా నమోదైంది.
అంతకుముందు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్లు నిలకడగా ఆడి జట్టుకు కీలక భాగస్వామ్యాన్ని అందించారు. రోరీ బర్న్స్ 61(153), హమీద్ హసీబ్ 68(195) పరుగులు చేశారు. అయితే షమి వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. 49వ ఓవర్లో షమి వేసిన బంతికి రోరీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని ఒవర్లకే హమీద్ కూడా పెవిలియన్ బాటపట్టాడు.