ETV Bharat / sports

ఆ విషయంలో ధోనీకి ఎవరూ సాటిలేరు: సెహ్వాగ్

author img

By

Published : Jan 21, 2020, 3:22 PM IST

Updated : Feb 17, 2020, 9:06 PM IST

భారత మాజీ క్రికెటర్​, విధ్వంసకర బ్యాట్స్​మన్ వీరేంద్ర సెహ్వాగ్​... మాజీ కెప్టెన్ ధోనీ గురించి మాట్లాడాడు. ప్రస్తుతం మన జట్టులో విఫలమైన వెంటనే మార్పులు చేస్తున్నారని, మహీ కెప్టెన్సీలో అలా ఉండేది కాదని అభిప్రాయపడ్డాడు.

Virender Sehwag
'ప్రతిభ​ను ఉపయోగించుకోవడంలో ధోనీకి సాటిలేరు'

టీమిండియా మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​.. మహేంద్ర సింగ్​ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. మహీ కెప్టెన్సీలో భారత్​కు అన్ని రంగాల్లో బలంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల కేఎల్​ రాహుల్​ అయిదో స్థానంలో ఆడాడు. ఈ విషయంపైనా మాట్లాడాడు ఈ స్టార్​ క్రికెటర్​.

Virender Sehwag
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్

"ఐదో స్థానంలో ఆడిన కేఎల్​ రాహుల్​ 4 సార్లు విఫలమైతే.. ప్రస్తుతం ఉన్న టీమిండియా యాజమాన్యం వెంటనే అతడి స్థానాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుంది. అదే ధోనీ కెప్టెన్సీలో ఆ పరిస్థితి ఉండేది కాదు. మరిన్ని అవకాశాలు ఇచ్చేవాడు. కష్టసమయంలో మహీ.. జట్టు సభ్యుల కు మద్దతుగా నిలిచేవాడు"
-- సెహ్వాగ్​, టీమిండియా మాజీ క్రికెటర్​

ఒకరికి ఓ స్థానం కేటాయిస్తే.. అందులో ఆకట్టుకున్నా, కాస్త నిరాశపర్చినా అవకాశాలు వస్తుండేవని అన్నాడు సెహ్వాగ్​. ధోనీ సారథ్యంలో తుదిజట్టు కూర్పుపై స్పష్టమైన అవగాహన ఉండేదని అభిప్రాయపడ్డాడు.

"ధోనీ కెప్టెన్​గా ఉన్న సమయంలో ప్రతి అంశంలోనూ పక్కా క్లారిటీ ఉండేది. ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్​ చేయాలి అనేది ముందుగానే నిర్ణయించేవారు. ప్రతిభ​ ఉన్న క్రికెటర్లపై మహీ ఎప్పుడూ కన్నేసి ఉంచేవాడు. భారత క్రికెట్​ను ముందుకు తీసుకెళ్తారని భావిస్తే, వారిపై ధోనీ ఎక్కువగా దృష్టిపెట్టేవాడు"
-- సెహ్వాగ్​, టీమిండియా మాజీ క్రికెటర్​

ధోనీ కెప్టెన్​గా ఉన్నప్పుడు వన్డేల్లో టాపార్డర్​ బ్యాట్స్​మన్​ మరింతగా రాణించారని చెప్పిన సెహ్వాగ్​... మిడిలార్డర్​ ఆటగాళ్లకు అతడి బ్యాటింగ్​ మద్దతుగా ఉండేదని గుర్తుచేసుకున్నాడు.

Virender Sehwag
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్

"ఆటగాళ్లకు సమయం ఇవ్వకపోతే తప్పులను ఎలా సరిదిద్దుకుంటారు. ఓపెనింగ్​కు మారకముందు నేను తొలుత మిడిలార్డర్​లో ఆడాను. చాలా తప్పిదాలు చేశాను. ఫలితంగా చాలా మ్యాచ్​లు ఓడిపోయాం. బాగా ఆడగలిగే సత్తా ఉన్నోడిని బెంచ్​లో కూర్చోపెట్టకూడదు. వారికి కాస్త సమయమివ్వాలి"
-- సెహ్వాగ్​, టీమిండియా మాజీ క్రికెటర్​

ఈ మధ్య కాలంలో భారత్.. యువ క్రికెటర్లను ఎక్కువగా పరీక్షిస్తోంది. పంత్​, సైనీ, శ్రేయస్​, శార్దూల్​ వంటి ఆటగాళ్లను భవిష్యత్తు తారలుగా మల్చుకుంటోంది. సంజూ శాంసన్​ విషయంలో మాత్రం తగిన న్యాయం చేయడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

టీమిండియా మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​.. మహేంద్ర సింగ్​ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. మహీ కెప్టెన్సీలో భారత్​కు అన్ని రంగాల్లో బలంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల కేఎల్​ రాహుల్​ అయిదో స్థానంలో ఆడాడు. ఈ విషయంపైనా మాట్లాడాడు ఈ స్టార్​ క్రికెటర్​.

Virender Sehwag
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్

"ఐదో స్థానంలో ఆడిన కేఎల్​ రాహుల్​ 4 సార్లు విఫలమైతే.. ప్రస్తుతం ఉన్న టీమిండియా యాజమాన్యం వెంటనే అతడి స్థానాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుంది. అదే ధోనీ కెప్టెన్సీలో ఆ పరిస్థితి ఉండేది కాదు. మరిన్ని అవకాశాలు ఇచ్చేవాడు. కష్టసమయంలో మహీ.. జట్టు సభ్యుల కు మద్దతుగా నిలిచేవాడు"
-- సెహ్వాగ్​, టీమిండియా మాజీ క్రికెటర్​

ఒకరికి ఓ స్థానం కేటాయిస్తే.. అందులో ఆకట్టుకున్నా, కాస్త నిరాశపర్చినా అవకాశాలు వస్తుండేవని అన్నాడు సెహ్వాగ్​. ధోనీ సారథ్యంలో తుదిజట్టు కూర్పుపై స్పష్టమైన అవగాహన ఉండేదని అభిప్రాయపడ్డాడు.

"ధోనీ కెప్టెన్​గా ఉన్న సమయంలో ప్రతి అంశంలోనూ పక్కా క్లారిటీ ఉండేది. ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్​ చేయాలి అనేది ముందుగానే నిర్ణయించేవారు. ప్రతిభ​ ఉన్న క్రికెటర్లపై మహీ ఎప్పుడూ కన్నేసి ఉంచేవాడు. భారత క్రికెట్​ను ముందుకు తీసుకెళ్తారని భావిస్తే, వారిపై ధోనీ ఎక్కువగా దృష్టిపెట్టేవాడు"
-- సెహ్వాగ్​, టీమిండియా మాజీ క్రికెటర్​

ధోనీ కెప్టెన్​గా ఉన్నప్పుడు వన్డేల్లో టాపార్డర్​ బ్యాట్స్​మన్​ మరింతగా రాణించారని చెప్పిన సెహ్వాగ్​... మిడిలార్డర్​ ఆటగాళ్లకు అతడి బ్యాటింగ్​ మద్దతుగా ఉండేదని గుర్తుచేసుకున్నాడు.

Virender Sehwag
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్

"ఆటగాళ్లకు సమయం ఇవ్వకపోతే తప్పులను ఎలా సరిదిద్దుకుంటారు. ఓపెనింగ్​కు మారకముందు నేను తొలుత మిడిలార్డర్​లో ఆడాను. చాలా తప్పిదాలు చేశాను. ఫలితంగా చాలా మ్యాచ్​లు ఓడిపోయాం. బాగా ఆడగలిగే సత్తా ఉన్నోడిని బెంచ్​లో కూర్చోపెట్టకూడదు. వారికి కాస్త సమయమివ్వాలి"
-- సెహ్వాగ్​, టీమిండియా మాజీ క్రికెటర్​

ఈ మధ్య కాలంలో భారత్.. యువ క్రికెటర్లను ఎక్కువగా పరీక్షిస్తోంది. పంత్​, సైనీ, శ్రేయస్​, శార్దూల్​ వంటి ఆటగాళ్లను భవిష్యత్తు తారలుగా మల్చుకుంటోంది. సంజూ శాంసన్​ విషయంలో మాత్రం తగిన న్యాయం చేయడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

SNTV Digital Daily Planning, 0800 GMT
Tuesday 21st January 2020.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Draw for CAF's second qualifying round in preliminary competition to reach the 2022 World Cup. Expect at 2230.
SOCCER: Manager reactions following selected Premier League fixtures, including:
Chelsea v Arsenal. Expect at 2330.
Sheffield United v Manchester City. Expect at 2300.
SOCCER: Selected Premier League managers speak ahead of midweek fixtures.
Manchester United. Expect at 1100.
Tottenham Hotspur. Expect at 1400.
Leicester City. Expect at 1430.
SOCCER: Barcelona prepare for their Copa del Rey tie against Ibiza. Expect at 1700.
SOCCER: Barcelona look ahead to their Copa del Rey tie against Ibiza. Expect at 1830.
SOCCER: Real Madrid train ahead of their Copa del Rey meeting with Unionistas de Salamanca. Expect at 1200.
SOCCER: Real Madrid talk ahead of their Copa del Rey meeting with Unionistas de Salamanca. Expect at 1500.
SOCCER: Spanish third tier team Unionistas de Salamanca prepare to host Real Madrid in the Copa del Rey. Expect at 1030.
SOCCER: SNTV meets with Libya and Esperance Sportive de Tunis winger Hamdou Elhouni. Expect at 1230.
SOCCER: Preview to AFC Under-23 Championship semi-final, Australia v South Korea. Expect at 0800.
SOCCER:  Saudi Arabia v Uzbekistan AFC Under-23 Championship semi-final preview. 0800.
TENNIS: Action and reaction from day two of the Australian Open in Melbourne, Australia. Expect throughout the day.
TENNIS: Behind the scenes feature from the 2020 Australian Open at Melbourne Park. Time tbc.
GAMES: Highlights from the Youth Winter Olympics event in Lausanne, Switzerland. Time tbc.
CYCLING: Highlights from stage one of Tour down under race. Already moved.
Last Updated : Feb 17, 2020, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.