దిల్లీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్ పతకాల వేట కొనసాగిస్తుంది. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషియన్ రైఫిల్ టీం విభాగంలో నీరజ్ కుమార్, స్వాప్నిల్ కుసాలే, చైన్ సింగ్లతో కూడిన షూటర్లు.. బంగారు పతకం సాధించారు. తాజా స్వర్ణంతో మొత్తం బంగారు పతకాల సంఖ్య 14కి చేరింది. ఫైనల్ ప్రత్యర్థి అమెరికా షూటర్లు నికోలస్ మొవర్, టిమొతి శెర్రి, పాట్రిక్ సుందర్మన్పై 47-25తో గెలుపొందింది భారత్.
ఈ మ్యాచ్ హంగేరీతో జరగాల్సి ఉండగా చివరి క్షణంలో అది రద్దయింది. ఈ విభాగంలో రెండో స్థానంలో ఉన్న హంగేరీ షూటర్లు ఇస్వావన్ పెని, పీటర్ సిడి మధ్య వివాదం నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంది. దీంతో మూడో స్థానంలో ఉన్న యూఎస్ ఫైనల్లో భారత్తో తలపడింది.
ఇదీ చదవండి: షూటింగ్ ప్రపంచకప్లో మనకు మరో స్వర్ణం