ETV Bharat / sports

ఆసీస్, ఇంగ్లాండ్​తో డే/నైట్ టెస్టు ఉంటుంది'

author img

By

Published : Feb 17, 2020, 5:48 AM IST

Updated : Mar 1, 2020, 2:11 PM IST

ఈ ఏడాది ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్​తోనూ ఓ డే/నైట్ మ్యాచ్ ఆడేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. దీనిపై త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపాడు.

గంగూలీ
గంగూలీ

భారత్-ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్టు కోసం ఎదురుచూస్తోన్న అభిమానులకు శుభవార్త. త్వరలోనే మీ కోరిక నెరవేరనుంది. ఈ ఏడాది చివర్లో ఆసీస్ గడ్డపై టీమిండియా పింక్ బాల్ టెస్టు ఆడనుంది. దీనిపై స్పష్టతనిచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. దీంతో పాటు మరో బంపర్ వార్తను క్రికెట్ అభిమానులకు వినిపించాడు దాదా. ఇంగ్లాండ్​తోనూ ఓ డే/నైట్ టెస్టు ఉంటుందని తెలిపాడు.

"అవును. ఆస్ట్రేలియాలో టీమిండియా డే/నైట్ టెస్టు ఆడుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాం. భారత్​లో ఇంగ్లాండ్​తో జరిగే టెస్టు సిరీస్​లో రెండో మ్యాచ్​ డే/నైట్​ మ్యాచ్​గా నిర్వహిస్తాం. ఇకనుంచి ప్రతి సిరీస్​లోనూ ఓ డే/నైట్ టెస్టు ఉండేలా చూస్తాం."

-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో అనుభవం లేని కారణంగా పింక్ బాల్ టెస్టుకు నో చెప్పింది బీసీసీఐ. కానీ ఇటీవల ఆసీస్​తో వన్డే సిరీస్ ప్రారంభంలో ఈ విషయంపై ఓ స్పష్టత ఇచ్చాడు టీమిండియా సారథి కోహ్లీ. ఆస్ట్రేలియాలో డే/నైట్ టెస్టు ఆడతామని తెలిపాడు.

"ఛాలెంజ్​కు మేం సిద్ధం. గబ్బా, పెర్త్ పిచ్ ఏదైనా ఓకే. ఆస్ట్రేలియా గడ్డపై పింక్ బాల్​ ఆడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం."

-కోహ్లీ, టీమిండియా సారథి

గతేడాది నవంబర్​లో బంగ్లాదేశ్​తో టీమిండియా పింక్ బాల్ టెస్టు ఆడింది. అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్పందించింది. తమ జట్టుతో కూడా డే/నైట్ టెస్టు ఆడాలని కోరింది.

భారత్-ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్టు కోసం ఎదురుచూస్తోన్న అభిమానులకు శుభవార్త. త్వరలోనే మీ కోరిక నెరవేరనుంది. ఈ ఏడాది చివర్లో ఆసీస్ గడ్డపై టీమిండియా పింక్ బాల్ టెస్టు ఆడనుంది. దీనిపై స్పష్టతనిచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. దీంతో పాటు మరో బంపర్ వార్తను క్రికెట్ అభిమానులకు వినిపించాడు దాదా. ఇంగ్లాండ్​తోనూ ఓ డే/నైట్ టెస్టు ఉంటుందని తెలిపాడు.

"అవును. ఆస్ట్రేలియాలో టీమిండియా డే/నైట్ టెస్టు ఆడుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాం. భారత్​లో ఇంగ్లాండ్​తో జరిగే టెస్టు సిరీస్​లో రెండో మ్యాచ్​ డే/నైట్​ మ్యాచ్​గా నిర్వహిస్తాం. ఇకనుంచి ప్రతి సిరీస్​లోనూ ఓ డే/నైట్ టెస్టు ఉండేలా చూస్తాం."

-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో అనుభవం లేని కారణంగా పింక్ బాల్ టెస్టుకు నో చెప్పింది బీసీసీఐ. కానీ ఇటీవల ఆసీస్​తో వన్డే సిరీస్ ప్రారంభంలో ఈ విషయంపై ఓ స్పష్టత ఇచ్చాడు టీమిండియా సారథి కోహ్లీ. ఆస్ట్రేలియాలో డే/నైట్ టెస్టు ఆడతామని తెలిపాడు.

"ఛాలెంజ్​కు మేం సిద్ధం. గబ్బా, పెర్త్ పిచ్ ఏదైనా ఓకే. ఆస్ట్రేలియా గడ్డపై పింక్ బాల్​ ఆడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం."

-కోహ్లీ, టీమిండియా సారథి

గతేడాది నవంబర్​లో బంగ్లాదేశ్​తో టీమిండియా పింక్ బాల్ టెస్టు ఆడింది. అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్పందించింది. తమ జట్టుతో కూడా డే/నైట్ టెస్టు ఆడాలని కోరింది.

Last Updated : Mar 1, 2020, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.