ETV Bharat / sports

బ్రిస్బేన్​ టెస్టు: నటరాజన్​, సుందర్​ అరంగేట్రం

author img

By

Published : Jan 15, 2021, 7:26 AM IST

గాయాల కారణంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న చివరి టెస్టుకు నలుగురు టీమ్​ఇండియా ఆటగాళ్లు దూరమయ్యారు. దీంతో పేసర్​ నటరాజన్​, స్పిన్నర్​ వాషింగ్టన్​ సుందర్​ అరంగేట్రం చేశారు.

India made four changes to their playing XI, Washington and Natarajan to debut
గబ్బా టెస్టు: అశ్విన్, బుమ్రా దూరం.. ఇద్దరి అరంగేట్రం

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న చివరి టెస్టుకు పలు మార్పులతో బరిలోకి దిగింది టీమ్​ఇండియా. గాయాల బెడదతో స్టార్​ క్రికెటర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్​ప్రీత్​ బుమ్రా సహ హనుమ విహారి దూరమయ్యారు. దీంతో బెంచ్​కు పరిమితమైన శార్దూల్ ఠాకూర్​, మయాంక్​ అగర్వాల్​ను జట్టులోకి తీసుకున్నారు.

శుక్రవారం నుంచి గబ్బా వేదికగా జరుగుతోన్న నిర్ణయాత్మక మ్యాచ్​తోనే పేసర్ టి.నటరాజన్, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్​ టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలోనే టీ20, వన్డేల్లో అరంగేట్రం చేసిన ఈ యార్కర్​ స్పెషలిస్టు.. ఇదే పర్యటన​లో టెస్టుల్లోనూ అరంగేట్రం చేయడం విశేషం. ఒకే పర్యటనలో అన్ని ఫార్మట్లలో అరంగేట్రం చేసిన ఏకైక భారత క్రికెటర్​ అతడే కావడం విశేషం.

ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. సిడ్నీ టెస్టుగా డ్రాగా ముగిసింది. జనవరి 15న (శుక్రవారం) ప్రారంభమైన చివరి మ్యాచ్​తో సిరీస్​ ఫలితం తేలనుంది.

ఇదీ చూడండి: టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆసీస్​

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న చివరి టెస్టుకు పలు మార్పులతో బరిలోకి దిగింది టీమ్​ఇండియా. గాయాల బెడదతో స్టార్​ క్రికెటర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్​ప్రీత్​ బుమ్రా సహ హనుమ విహారి దూరమయ్యారు. దీంతో బెంచ్​కు పరిమితమైన శార్దూల్ ఠాకూర్​, మయాంక్​ అగర్వాల్​ను జట్టులోకి తీసుకున్నారు.

శుక్రవారం నుంచి గబ్బా వేదికగా జరుగుతోన్న నిర్ణయాత్మక మ్యాచ్​తోనే పేసర్ టి.నటరాజన్, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్​ టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలోనే టీ20, వన్డేల్లో అరంగేట్రం చేసిన ఈ యార్కర్​ స్పెషలిస్టు.. ఇదే పర్యటన​లో టెస్టుల్లోనూ అరంగేట్రం చేయడం విశేషం. ఒకే పర్యటనలో అన్ని ఫార్మట్లలో అరంగేట్రం చేసిన ఏకైక భారత క్రికెటర్​ అతడే కావడం విశేషం.

ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. సిడ్నీ టెస్టుగా డ్రాగా ముగిసింది. జనవరి 15న (శుక్రవారం) ప్రారంభమైన చివరి మ్యాచ్​తో సిరీస్​ ఫలితం తేలనుంది.

ఇదీ చూడండి: టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆసీస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.