ETV Bharat / sports

క్రికెటర్లకు క్వారంటైన్​ పూర్తి.. ప్రాక్టీసుకు అనుమతి - భారత్​-ఇంగ్లాండ్​ ఆటగాళ్లు నెట్​ ప్రాక్టీస్​ షురూ

టెస్టు సిరీస్​లో పాల్గొనేందుకు చెన్నై చేరుకున్న టీమ్​ఇండియా, ఇంగ్లాండ్​ ఆటగాళ్లకు మూడోసారి చేసిన కొవిడ్​ పరీక్షల్లో నెగెటివ్​గా తేలింది. దీంతో మంగళవారం నుంచి వీరంతా నెట్​ ప్రాక్టీస్​ మొదలుపెట్టవచ్చని బీసీసీఐ స్పష్టం చేసింది.

kohli
కోహ్లీ
author img

By

Published : Feb 1, 2021, 5:43 PM IST

Updated : Feb 1, 2021, 6:23 PM IST

టెస్టు సిరీస్​ కోసం చెన్నైలో క్వారంటైన్​లో ఉన్న టీమ్ఇండియా, ఇంగ్లాండ్​ ఆటగాళ్లకు మూడోసారి చేసిన కొవిడ్​ పరీక్షల్లో నెగెటివ్​గా తేలింది. ఫలితంగా వీరందరికీ నెట్​ ప్రాక్టీస్​కు అవకాశం లభించింది. ఫిబ్రవరి 2(మంగళవారం) నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

ఇప్పటికే ఇంగ్లాండ్​ ఆటగాళ్లు బెన్​ స్టోక్స్​, జోఫ్రా ఆర్చర్​, రోరి బర్న్స్​ తమ నిర్బంధంతో పాటు మూడు సార్లు కొవిడ్​ పరీక్షను పూర్తిచేసుకొని ప్రాక్టీసును​ ప్రారంభించేశారు.

షెడ్యూల్​ ఇదే

భారత​ పర్యటనలో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలుత ఫిబ్రవరి 5 నుంచి జరిగే టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, మూడోదైన డేనైట్ మ్యాచ్​తో పాటు నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ (మెతేరా స్టేడియం) వేదిక కానుంది. తర్వాత టీ20 సిరీస్​ కోసం ఇరుజట్లు సిద్ధమవనున్నాయి.
ఇదీ చూడండి : భారత్​Xఇంగ్లాండ్​: చెన్నైలో ఆధిపత్యం ఎవరిదంటే?

టెస్టు సిరీస్​ కోసం చెన్నైలో క్వారంటైన్​లో ఉన్న టీమ్ఇండియా, ఇంగ్లాండ్​ ఆటగాళ్లకు మూడోసారి చేసిన కొవిడ్​ పరీక్షల్లో నెగెటివ్​గా తేలింది. ఫలితంగా వీరందరికీ నెట్​ ప్రాక్టీస్​కు అవకాశం లభించింది. ఫిబ్రవరి 2(మంగళవారం) నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

ఇప్పటికే ఇంగ్లాండ్​ ఆటగాళ్లు బెన్​ స్టోక్స్​, జోఫ్రా ఆర్చర్​, రోరి బర్న్స్​ తమ నిర్బంధంతో పాటు మూడు సార్లు కొవిడ్​ పరీక్షను పూర్తిచేసుకొని ప్రాక్టీసును​ ప్రారంభించేశారు.

షెడ్యూల్​ ఇదే

భారత​ పర్యటనలో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలుత ఫిబ్రవరి 5 నుంచి జరిగే టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, మూడోదైన డేనైట్ మ్యాచ్​తో పాటు నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ (మెతేరా స్టేడియం) వేదిక కానుంది. తర్వాత టీ20 సిరీస్​ కోసం ఇరుజట్లు సిద్ధమవనున్నాయి.
ఇదీ చూడండి : భారత్​Xఇంగ్లాండ్​: చెన్నైలో ఆధిపత్యం ఎవరిదంటే?

Last Updated : Feb 1, 2021, 6:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.