ETV Bharat / sports

మొతేరా 'స్లో పిచ్​'పై ఇంగ్లాండ్ కెప్టెన్ అసంతృప్తి

author img

By

Published : Mar 15, 2021, 12:16 PM IST

మొతేరా పిచ్​పై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్​ పరిమిత ఓవర్ల సారథి ఇయాన్ మోర్గాన్. తొలి టీ20తో పోలిస్తే ఈ వికెట్​ స్లోగా ఉందని తెలిపాడు.

I was disappointed with the way played on slow pitch: Morgan
మొతేరా 'స్లో పిచ్​'పై ఇంగ్లాండ్ కెప్టెన్ అసంతృప్తి

మొతేరా పిచ్​పై ఇంగ్లాండ్ కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి టీ20లో వికెట్​ ఇలా లేదని వాపోయాడు. స్లో వికెట్​పై తమ ఆటగాళ్లు సరిగా ఆడలేకపోయారని తెలిపాడు. పిచ్​ కారణంగా తాము ఆటలో వెనుకబడ్డామని పేర్కొన్నాడు.

"మొదటి 11 ఓవర్లలో 91/2తో మంచి స్థితిలో ఉన్నాం. కానీ, ఆ తర్వాత భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. తొలి మ్యాచ్​తో పోలిస్తే ఇది భిన్నమైన పిచ్​. దీంతో మేము ఈ గేమ్​లో వెనుకబడ్డాం. ఇది కొంత నిరాశ కలిగించింది. స్లో వికెట్ కారణంగా మేము పోరాడలేకపోయాం. పేస్​ తక్కువ ఉంది. పేస్​ అనేది బ్యాట్స్​మెన్లకు ఎల్లప్పుడూ సవాలే. ఈ వికెట్​పై మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్నా."

-ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ కెప్టెన్.

లైన్​కు కట్టుబడి తమ ఆటగాళ్లు బౌలింగ్ చేశారని మోర్గాన్ తెలిపాడు. కానీ, భారత్ మాకంటే గొప్పగా బౌలింగ్ చేసిందని పేర్కొన్నాడు. గాయంతో రెండో టీ20కి దూరమైన బౌలర్​ మార్క్​ వుడ్​ తదుపరి మ్యాచ్​కు అందుబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు మోర్గాన్​. తదుపరి మ్యాచ్​లో స్పిన్​ పిచ్​ అందుబాటులో ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ సవాళ్లన్నిటికీ మేము సిద్ధమేనని వెల్లడించాడు.

ఇదీ చదవండి: ఆ లక్ష్యంతోనే గచ్చిబౌలి స్టేడియంలో సింధు ప్రాక్టీస్!

మొతేరా పిచ్​పై ఇంగ్లాండ్ కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి టీ20లో వికెట్​ ఇలా లేదని వాపోయాడు. స్లో వికెట్​పై తమ ఆటగాళ్లు సరిగా ఆడలేకపోయారని తెలిపాడు. పిచ్​ కారణంగా తాము ఆటలో వెనుకబడ్డామని పేర్కొన్నాడు.

"మొదటి 11 ఓవర్లలో 91/2తో మంచి స్థితిలో ఉన్నాం. కానీ, ఆ తర్వాత భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. తొలి మ్యాచ్​తో పోలిస్తే ఇది భిన్నమైన పిచ్​. దీంతో మేము ఈ గేమ్​లో వెనుకబడ్డాం. ఇది కొంత నిరాశ కలిగించింది. స్లో వికెట్ కారణంగా మేము పోరాడలేకపోయాం. పేస్​ తక్కువ ఉంది. పేస్​ అనేది బ్యాట్స్​మెన్లకు ఎల్లప్పుడూ సవాలే. ఈ వికెట్​పై మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్నా."

-ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ కెప్టెన్.

లైన్​కు కట్టుబడి తమ ఆటగాళ్లు బౌలింగ్ చేశారని మోర్గాన్ తెలిపాడు. కానీ, భారత్ మాకంటే గొప్పగా బౌలింగ్ చేసిందని పేర్కొన్నాడు. గాయంతో రెండో టీ20కి దూరమైన బౌలర్​ మార్క్​ వుడ్​ తదుపరి మ్యాచ్​కు అందుబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు మోర్గాన్​. తదుపరి మ్యాచ్​లో స్పిన్​ పిచ్​ అందుబాటులో ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ సవాళ్లన్నిటికీ మేము సిద్ధమేనని వెల్లడించాడు.

ఇదీ చదవండి: ఆ లక్ష్యంతోనే గచ్చిబౌలి స్టేడియంలో సింధు ప్రాక్టీస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.