ETV Bharat / sports

ఇంగ్లాండ్​-భారత్​ ద్వైపాక్షిక సిరీస్​ వాయిదా!

author img

By

Published : Jul 15, 2020, 12:52 PM IST

ఈ ఏడాది సెప్టెంబరులో ఇంగ్లాండ్​- భారత్​ మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉంది. అదే నెలలో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్​ వాయిదా పడితే.. ఐపీఎల్​-2020 నిర్వహించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.

England's India tour set to be postponed
ఇంగ్లాండ్​-భారత్​ మధ్య ద్వైపాక్షిక సిరీస్​ వాయిదా!

కరోనా దెబ్బకు భారత్‌లో మరో ద్వైపాక్షిక సిరీస్ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌-అక్టోబర్‌లో ఇంగ్లీష్​‌ జట్టు‌ భారత్‌లో పర్యటించాల్సి ఉంది. మూడు వన్డేలు, టీ20లతో కూడిన సిరీస్​ను​ ఇరుజట్లు ఆడాల్సి ఉంది. కానీ వైరస్​ ‌కారణంగా వచ్చే ఏడాదికి ఇది​ వాయిదా పడుతుందని సమాచారం.

ecb
ఈసీబీ

ఐపీఎల్​పై ఇంకా సందిగ్ధమే..

మహమ్మారి వల్ల అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ నిర్వహణను వాయిదా వేయాలని ఐసీసీ చర్చలు జరుపుతోంది. ఒకవేళ ఈ మెగాటోర్నీ వాయిదా పడితే సెప్టెంబరు చివరి వారంలో ఐపీఎల్​ 13వ సీజన్​ నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ.

అదే సమయంలో షెడ్యూల్​ ప్రకారం ఇంగ్లాండ్​తో ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సి ఉంది. కాబట్టి ఐపీఎల్​ నిర్వహిస్తే​ ఈ సిరీస్​ వచ్చే ఏడాదికి వాయిదా పడుతుంది. ఇదే విషయంపై ఇరు దేశాల క్రికెట్​ బోర్డులు మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం.

ఇప్పటికే ఐపీఎల్​కు ఆతిథ్యమిచ్చేందుకు యూఏఈ, శ్రీలంక ముందుకొచ్చాయి. కానీ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రం ఈ టోర్నీని స్వదేశంలో నిర్వహించడమే తమ తొలి ప్రాధాన్యతమని ఇటీవలె స్పష్టం చేశాడు.

bcci
బీసీసీఐ

ఇది చూడండి : కరోనాను జయించిన బంగ్లా మాజీ సారథి మొర్తజా

కరోనా దెబ్బకు భారత్‌లో మరో ద్వైపాక్షిక సిరీస్ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌-అక్టోబర్‌లో ఇంగ్లీష్​‌ జట్టు‌ భారత్‌లో పర్యటించాల్సి ఉంది. మూడు వన్డేలు, టీ20లతో కూడిన సిరీస్​ను​ ఇరుజట్లు ఆడాల్సి ఉంది. కానీ వైరస్​ ‌కారణంగా వచ్చే ఏడాదికి ఇది​ వాయిదా పడుతుందని సమాచారం.

ecb
ఈసీబీ

ఐపీఎల్​పై ఇంకా సందిగ్ధమే..

మహమ్మారి వల్ల అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ నిర్వహణను వాయిదా వేయాలని ఐసీసీ చర్చలు జరుపుతోంది. ఒకవేళ ఈ మెగాటోర్నీ వాయిదా పడితే సెప్టెంబరు చివరి వారంలో ఐపీఎల్​ 13వ సీజన్​ నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ.

అదే సమయంలో షెడ్యూల్​ ప్రకారం ఇంగ్లాండ్​తో ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సి ఉంది. కాబట్టి ఐపీఎల్​ నిర్వహిస్తే​ ఈ సిరీస్​ వచ్చే ఏడాదికి వాయిదా పడుతుంది. ఇదే విషయంపై ఇరు దేశాల క్రికెట్​ బోర్డులు మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం.

ఇప్పటికే ఐపీఎల్​కు ఆతిథ్యమిచ్చేందుకు యూఏఈ, శ్రీలంక ముందుకొచ్చాయి. కానీ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రం ఈ టోర్నీని స్వదేశంలో నిర్వహించడమే తమ తొలి ప్రాధాన్యతమని ఇటీవలె స్పష్టం చేశాడు.

bcci
బీసీసీఐ

ఇది చూడండి : కరోనాను జయించిన బంగ్లా మాజీ సారథి మొర్తజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.