ETV Bharat / sports

రాణించిన ఇంగ్లాండ్​.. విండీస్​పై 170 పరుగుల ఆధిక్యం

author img

By

Published : Jul 12, 2020, 5:18 AM IST

Updated : Jul 12, 2020, 6:25 AM IST

ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ మధ్య సౌథాంప్టన్​ వేదికగా జరుగుతోన్న తొలిటెస్ట్ మ్యాచ్​లో ఫలితం తేలే అవకాశం కనిపిస్తోంది. నాలుగో రోజు బ్యాటింగ్​ కొనసాగించిన ఇంగ్లాండ్​ 284-8 స్కోరు సాధించి.. విండీస్​పై 170 పరుగుల ఆధిక్యం పొందింది. ఇంకా రెండు వికెట్లు చేతిలో ఉన్న ఆ​ జట్టు.. ఆట చివరి రోజు ఎంతమేరకు రాణిస్తుందనే దానిపై ఇరుజట్ల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

England ekes out lead of 170 over Windies after 4th day
రాణించిన ఇంగ్లాండ్​.. విండీస్​పై 170 పరుగుల అధిక్యం

ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ల మధ్య జరుగుతోన్న తొలిటెస్టు​ ఫలితం దిశగా సాగుతోంది. మూడోరోజు చివరి సెషన్​లోనే బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లీష్​ బ్యాట్స్​మెన్​.. నాలుగోరోజు విండీస్​ పేస్​ దళాన్ని దీటుగా ఎదుర్కొన్నారు. ఆధిక్యం పెరుగుతున్న తరుణంలో కరీబియన్​ బౌలర్లు విజృంభించారు. చివరి సెషన్​లో ఏకంగా ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్​ను నిలువరించారు. ఫలితంగా 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి 170 పరుగుల ఆధిక్యంలో ఉంది ఆతిథ్య జట్టు.

రాణించిన ఆ ముగ్గురు

ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్​లో జాక్​ క్రావ్​లీ(127 బంతుల్లో 76 పరుగులు), డామ్ సిబ్లీ(164 బంతుల్లో 50 పరుగులు) అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో కెప్టెన్​ బెన్​ స్టోక్స్​ (79 బంతుల్లో 46 పరుగులు) కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. ఇంకా రెండు వికెట్లు మాత్రమే ఉన్న ఇంగ్లాండ్​.. చివరి రోజు ఎంత మేరకు నిలబడతారో అనే దానిపైనే ఆ జట్టు విజయం ఆధారపడి ఉంది. అయితే ఆ రెండు వికెట్లను విండీస్​ బౌలర్లు ఎంత త్వరగా కట్టడి చేస్తే.. అంత వేగంగా రెండో ఇన్నింగ్స్​ను ఆరంభిస్తుంది కరీబియన్ టీమ్​.

మలుపు తిప్పిన గాబ్రియెల్​

విండీస్​ బౌలర్లలో ఎస్​ గాబ్రియెల్​ 18 ఓవర్లలో 62 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. చివరి గంటలో ఇతడు అలీ పోప్​, డోమ్​ బెస్​లను వెనక్కిపంపాడు. మరో బౌలర్​ జోసెఫ్​ కూడా16 ఓవర్లలో 40 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు.

ఇదీ చదవండి: ఈ రికార్డును ఎవరూ బ్రేక్​ చేయలేరేమో!

ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ల మధ్య జరుగుతోన్న తొలిటెస్టు​ ఫలితం దిశగా సాగుతోంది. మూడోరోజు చివరి సెషన్​లోనే బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లీష్​ బ్యాట్స్​మెన్​.. నాలుగోరోజు విండీస్​ పేస్​ దళాన్ని దీటుగా ఎదుర్కొన్నారు. ఆధిక్యం పెరుగుతున్న తరుణంలో కరీబియన్​ బౌలర్లు విజృంభించారు. చివరి సెషన్​లో ఏకంగా ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్​ను నిలువరించారు. ఫలితంగా 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి 170 పరుగుల ఆధిక్యంలో ఉంది ఆతిథ్య జట్టు.

రాణించిన ఆ ముగ్గురు

ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్​లో జాక్​ క్రావ్​లీ(127 బంతుల్లో 76 పరుగులు), డామ్ సిబ్లీ(164 బంతుల్లో 50 పరుగులు) అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో కెప్టెన్​ బెన్​ స్టోక్స్​ (79 బంతుల్లో 46 పరుగులు) కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. ఇంకా రెండు వికెట్లు మాత్రమే ఉన్న ఇంగ్లాండ్​.. చివరి రోజు ఎంత మేరకు నిలబడతారో అనే దానిపైనే ఆ జట్టు విజయం ఆధారపడి ఉంది. అయితే ఆ రెండు వికెట్లను విండీస్​ బౌలర్లు ఎంత త్వరగా కట్టడి చేస్తే.. అంత వేగంగా రెండో ఇన్నింగ్స్​ను ఆరంభిస్తుంది కరీబియన్ టీమ్​.

మలుపు తిప్పిన గాబ్రియెల్​

విండీస్​ బౌలర్లలో ఎస్​ గాబ్రియెల్​ 18 ఓవర్లలో 62 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. చివరి గంటలో ఇతడు అలీ పోప్​, డోమ్​ బెస్​లను వెనక్కిపంపాడు. మరో బౌలర్​ జోసెఫ్​ కూడా16 ఓవర్లలో 40 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు.

ఇదీ చదవండి: ఈ రికార్డును ఎవరూ బ్రేక్​ చేయలేరేమో!

Last Updated : Jul 12, 2020, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.