ETV Bharat / sports

స్వదేశానికి సురేశ్ రైనా.. ఆయన మరణమే కారణం!

ఐపీఎల్​ నుంచి అర్థంతరంగా రైనా తప్పుకోవడానికి కారణం, ఆయన బంధువు ఒకరు దుండగుల దాడిలో చనిపోవడమే కారణమని తెలుస్తోంది. ఈ విషయమై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

author img

By

Published : Aug 29, 2020, 7:35 PM IST

స్వదేశానికి సురేశ్ రైనా.. ఆయన మరణమే కారణం!
సురేశ్ రైనా

ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లిన సురేశ్ రైనా.. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చేయనున్నాడని చెన్నై సూపర్​కింగ్స్ యాజమాన్యం శనివారం ప్రకటించింది. ప్రస్తుత సీజన్​ మొత్తానికి దూరం కానున్నాడని వెల్లడించింది. అప్పటినుంచి అసలు కారణం ఏమై ఉంటుందా? అని క్రికెట్ అభిమానులు అందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

ఏం జరిగింది?

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్​ పఠాన్​కోట్​లో ఉంటున్న అశోక్ కుమార్ ప్రభుత్వ కాంట్రాక్టర్​గా పనిచేస్తున్నారు. ఆగస్టు 19 రాత్రి తన డాబాపై నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఆయన ఇంటిపై దాడి చేసి, బంగారం, నగదు ఎత్తుకెళ్లిపోయారు. ఈ క్రమంలోనే అశోక్​ తలకు తీవ్రగాయమై, ఆ రాత్రే మరణించారు. మిగిలిన కుటుంబసభ్యులకు కూడా గాయాలయ్యాయి. వీరిలో అశోక్ సతీమణి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.

suresh raina
భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా

భారత క్రికెటర్ రైనాకు అశోక్​ కుమార్​తో బంధుత్వం ఉందని, త్వరలో ఆయన కుటుంబాన్ని చూసేందుకు వస్తారని ఆయన సోదరుడు శ్యామ్​ లాల్ చెప్పారు. అయితే రైనా, అశోక్ బంధువులు అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.​​

ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లిన సురేశ్ రైనా.. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చేయనున్నాడని చెన్నై సూపర్​కింగ్స్ యాజమాన్యం శనివారం ప్రకటించింది. ప్రస్తుత సీజన్​ మొత్తానికి దూరం కానున్నాడని వెల్లడించింది. అప్పటినుంచి అసలు కారణం ఏమై ఉంటుందా? అని క్రికెట్ అభిమానులు అందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

ఏం జరిగింది?

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్​ పఠాన్​కోట్​లో ఉంటున్న అశోక్ కుమార్ ప్రభుత్వ కాంట్రాక్టర్​గా పనిచేస్తున్నారు. ఆగస్టు 19 రాత్రి తన డాబాపై నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఆయన ఇంటిపై దాడి చేసి, బంగారం, నగదు ఎత్తుకెళ్లిపోయారు. ఈ క్రమంలోనే అశోక్​ తలకు తీవ్రగాయమై, ఆ రాత్రే మరణించారు. మిగిలిన కుటుంబసభ్యులకు కూడా గాయాలయ్యాయి. వీరిలో అశోక్ సతీమణి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.

suresh raina
భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా

భారత క్రికెటర్ రైనాకు అశోక్​ కుమార్​తో బంధుత్వం ఉందని, త్వరలో ఆయన కుటుంబాన్ని చూసేందుకు వస్తారని ఆయన సోదరుడు శ్యామ్​ లాల్ చెప్పారు. అయితే రైనా, అశోక్ బంధువులు అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.