ETV Bharat / sitara

కుదిరిన సయోధ్య.. థియేటర్లలో సందడే సందడి

వర్చువల్​ ప్రింట్​ ఫీజుతో పాటు నిర్వాహణ ఛార్జీల విషయంలో నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాలకు మధ్య సయోధ్య కుదిరింది! తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్​ స్క్రీన్​ థియేటర్లలో ఈ నెలలో విడుదలయ్యే కొత్త సినిమాలకు వీపీఎఫ్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు నిర్మాత మండలి ప్రకటించింది.

author img

By

Published : Dec 19, 2020, 7:46 PM IST

theatres opening
కొత్త సినిమాల విడుదల

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు కొత్త సినిమాల విడుదలకు మార్గం సుగమమైంది. వర్చువల్ ప్రింట్ ఫీజుతోపాటు నిర్వాహణ ఛార్జీల విషయంలో కొన్నిరోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య నెలకొన్న వివాదానికి తాత్కాలికంగా తెరదించుతూ నిర్మాతల మండలి తమ నిర్ణయాన్ని ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ నెలలో విడుదలయ్యే కొత్త సినిమాలకు వీపీఎఫ్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో విడుదలయ్యే సినిమాలకూ డిజిటల్ ఛార్జీల్లో 40 శాతం నిర్మాతలే చెల్లిస్తారని స్పష్టం చేసింది. అలాగే డిజిటల్ సర్వీసు ఛార్జీల విషయంలో వచ్చే ఏడాది మార్చి 31లోపు ఒప్పందం జరిగే అవకాశముందని చెప్పంది. ఇతర రాష్ట్రాల్లో డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లతో జరుగుతున్న చర్చల్లో వచ్చే నిర్ణయాలను తెలుగు పరిశ్రమలోనూ అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు సినీపరిశ్రమ తిరిగి ప్రారంభించడానికి సర్వీసు ప్రొవైడర్లు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

ఇదీ సమస్య

లాక్​డౌన్​ తర్వాత థియేటర్లు తిరిగి తెరిచే విషయంలో నిర్మాతలు, యజమానులకు మధ్య కొద్దీ రోజులుగా వివాదం జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం ప్రేక్షకులతోనే ప్రదర్శనలు నిర్వహిస్తే తీవ్రంగా నష్టపోతామని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్ల నిర్వహణపై నిర్మాతల మండలి షరతులు పెడుతూ అన్ని మల్టీఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు నోటీసులు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో నిర్మాతల ఎంపిక ప్రకారమే టికెట్ ధరలు ఉండాలని, సాయంత్రం 4 గంటలు, 7 గంటలు, రాత్రి 10 గంటలకు తప్పనిసరిగా చిన్న సినిమాలను ప్రదర్శించాలని నిబంధనలు పెట్టారు. అలాగే థియేటర్ల నిర్వహణ ఛార్జీలను నిర్మాతలకు విధించవద్దని, ఆన్​లైన్ టికెట్ బుకింగ్​పై వచ్చే ఆదాయంతో పాటు ప్రదర్శన మొత్తంపై 60 శాతం వాటా ఇకపై నిరంతరం నిర్మాతలకు చెల్లించాలని కోరారు. తమిళనాడు తరహాలో థియేటర్లన్నీ తెలుగు సినిమాలను 60 శాతం, ఇతర భాషా చిత్రాలను 40 శాతం మాత్రమే ప్రదర్శించాలని సూచించారు. ఇలా మొత్తం 11 నిబంధనలు పేర్కొంటూ అన్ని మల్టీప్లెక్స్, సింగిల్ థియేటర్లకు నోటీసులు జారీ చేశారు.

థియేటర్ల వ్యతిరేకత

నిర్మాతల మండలి నిర్ణయాన్ని మల్టీఫ్లెక్స్ యజమానులు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు వ్యతిరేకించారు. థియేటర్ల ఆదాయంలో 60 శాతం వాటా కావాలని కోరడం సమంజసం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాతలు పెట్టిన నిబంధనలు పాటించడం తమ వల్ల కాదని ఖరాఖండిగా చెప్పారు. అవసరమైతే థియేటర్లు పూర్తిగా మూసేసి వాణిజ్య సముదాయాలుగా మార్చుకుంటామని హెచ్చరించారు. కరోనా కారణంగా ఇప్పటికే కోట్లలో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తోన్న మల్టీఫ్లెక్స్ యజమానులు.. నిర్మాతలు పెట్టిన షరతులు సినీ పరిశ్రమకు మరింత నష్టాన్ని చేకూరుస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలో 15 నుంచి 20 థియేటర్లు మూతపడగా.. ఇప్పుడు నిర్మాతల నిర్ణయం వల్ల వచ్చే మూడు నెలల్లో 100 థియేటర్లకుపైగా మూతపడతాయని యజమానులు వాపోయారు.

పలు దఫాలుగా చర్చలు

ఈ విషయంలో నిర్మాతల మండలి.. మల్టీఫ్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. వర్చువల్ ప్రింట్ ఫీజుతోపాటు ఆదాయంలో వాటాల విషయంలో యజమానులు దిగిరాకపోవడం వల్ల నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాట వినకపోతే కొత్త సినిమాలను విడుదల చేయమని తెగేసి చెప్పారు. దీంతో అటు నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య నెలకొన్న వివాదం సినీ పరిశ్రమను మరోసారి గందరగోళంలో పడేసింది. ఈ క్రిస్మస్ పండగతోపాటు వచ్చే సంక్రాంతికి విడుదల కావల్సిన సినిమాలపై సందిగ్ధత నెలకొంది. అయితే నిర్మాత మండలి తాజా నిర్ణయంతో క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు కొత్త సినిమాల విడుదలకు మార్గం సుగమమైంది.

ఇదీ చూడండి : థియేటర్లు మూసేస్తాం.. షరతులు వద్దు!

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు కొత్త సినిమాల విడుదలకు మార్గం సుగమమైంది. వర్చువల్ ప్రింట్ ఫీజుతోపాటు నిర్వాహణ ఛార్జీల విషయంలో కొన్నిరోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య నెలకొన్న వివాదానికి తాత్కాలికంగా తెరదించుతూ నిర్మాతల మండలి తమ నిర్ణయాన్ని ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ నెలలో విడుదలయ్యే కొత్త సినిమాలకు వీపీఎఫ్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో విడుదలయ్యే సినిమాలకూ డిజిటల్ ఛార్జీల్లో 40 శాతం నిర్మాతలే చెల్లిస్తారని స్పష్టం చేసింది. అలాగే డిజిటల్ సర్వీసు ఛార్జీల విషయంలో వచ్చే ఏడాది మార్చి 31లోపు ఒప్పందం జరిగే అవకాశముందని చెప్పంది. ఇతర రాష్ట్రాల్లో డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లతో జరుగుతున్న చర్చల్లో వచ్చే నిర్ణయాలను తెలుగు పరిశ్రమలోనూ అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు సినీపరిశ్రమ తిరిగి ప్రారంభించడానికి సర్వీసు ప్రొవైడర్లు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

ఇదీ సమస్య

లాక్​డౌన్​ తర్వాత థియేటర్లు తిరిగి తెరిచే విషయంలో నిర్మాతలు, యజమానులకు మధ్య కొద్దీ రోజులుగా వివాదం జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం ప్రేక్షకులతోనే ప్రదర్శనలు నిర్వహిస్తే తీవ్రంగా నష్టపోతామని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్ల నిర్వహణపై నిర్మాతల మండలి షరతులు పెడుతూ అన్ని మల్టీఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు నోటీసులు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో నిర్మాతల ఎంపిక ప్రకారమే టికెట్ ధరలు ఉండాలని, సాయంత్రం 4 గంటలు, 7 గంటలు, రాత్రి 10 గంటలకు తప్పనిసరిగా చిన్న సినిమాలను ప్రదర్శించాలని నిబంధనలు పెట్టారు. అలాగే థియేటర్ల నిర్వహణ ఛార్జీలను నిర్మాతలకు విధించవద్దని, ఆన్​లైన్ టికెట్ బుకింగ్​పై వచ్చే ఆదాయంతో పాటు ప్రదర్శన మొత్తంపై 60 శాతం వాటా ఇకపై నిరంతరం నిర్మాతలకు చెల్లించాలని కోరారు. తమిళనాడు తరహాలో థియేటర్లన్నీ తెలుగు సినిమాలను 60 శాతం, ఇతర భాషా చిత్రాలను 40 శాతం మాత్రమే ప్రదర్శించాలని సూచించారు. ఇలా మొత్తం 11 నిబంధనలు పేర్కొంటూ అన్ని మల్టీప్లెక్స్, సింగిల్ థియేటర్లకు నోటీసులు జారీ చేశారు.

థియేటర్ల వ్యతిరేకత

నిర్మాతల మండలి నిర్ణయాన్ని మల్టీఫ్లెక్స్ యజమానులు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు వ్యతిరేకించారు. థియేటర్ల ఆదాయంలో 60 శాతం వాటా కావాలని కోరడం సమంజసం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాతలు పెట్టిన నిబంధనలు పాటించడం తమ వల్ల కాదని ఖరాఖండిగా చెప్పారు. అవసరమైతే థియేటర్లు పూర్తిగా మూసేసి వాణిజ్య సముదాయాలుగా మార్చుకుంటామని హెచ్చరించారు. కరోనా కారణంగా ఇప్పటికే కోట్లలో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తోన్న మల్టీఫ్లెక్స్ యజమానులు.. నిర్మాతలు పెట్టిన షరతులు సినీ పరిశ్రమకు మరింత నష్టాన్ని చేకూరుస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలో 15 నుంచి 20 థియేటర్లు మూతపడగా.. ఇప్పుడు నిర్మాతల నిర్ణయం వల్ల వచ్చే మూడు నెలల్లో 100 థియేటర్లకుపైగా మూతపడతాయని యజమానులు వాపోయారు.

పలు దఫాలుగా చర్చలు

ఈ విషయంలో నిర్మాతల మండలి.. మల్టీఫ్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. వర్చువల్ ప్రింట్ ఫీజుతోపాటు ఆదాయంలో వాటాల విషయంలో యజమానులు దిగిరాకపోవడం వల్ల నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాట వినకపోతే కొత్త సినిమాలను విడుదల చేయమని తెగేసి చెప్పారు. దీంతో అటు నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య నెలకొన్న వివాదం సినీ పరిశ్రమను మరోసారి గందరగోళంలో పడేసింది. ఈ క్రిస్మస్ పండగతోపాటు వచ్చే సంక్రాంతికి విడుదల కావల్సిన సినిమాలపై సందిగ్ధత నెలకొంది. అయితే నిర్మాత మండలి తాజా నిర్ణయంతో క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు కొత్త సినిమాల విడుదలకు మార్గం సుగమమైంది.

ఇదీ చూడండి : థియేటర్లు మూసేస్తాం.. షరతులు వద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.