బుల్లితెరపై ప్రతి వారం ప్రసారమయ్యే ప్రఖ్యాత 'ద కపిల్ శర్మ' షోను నిలిపివేయాలని సుశాంత్ సింగ్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్మాతల్లో అగ్రహీరో సల్మాన్ ఖాన్ ఒకరు కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
"ప్రియమైన సభ్యులారా, 'ద కపిల్ శర్మ షో' నిర్మాతల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. అతడికి సంబంధించి సినిమాలతో సహా ప్రతిఒక్కటి బాయ్కాట్ చేద్దాం. మొదటగా ఈ బుల్లితెర కార్యక్రమంతోనే మన ఉద్యమం ప్రారంభిద్దాం" అంటూ 'జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్' అనే ఫేస్బుక్ గ్రూప్లో పోస్ట్ పెట్టారు. సదరు గ్రూప్లో ఉన్న 91 వేలమంది యూజర్స్ దీనికి మద్దతూ పలుకుతూ ఈ విషయాన్ని సమర్ధించారు.
సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి బాలీవుడ్లో నెపోటిజమ్ అంశం చర్చనీయాంశమైంది. సల్మాన్ఖాన్, నిర్మాత మహేశ్ భట్, దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ సహా పలువురు ప్రముఖుల చర్యల వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిపై వ్యక్తిగతంగా, సినిమాల విషయంలో తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
ఇది చూడండి ఎస్పీ బాలు హెల్త్ బులెటిన్ విడుదల