ETV Bharat / sitara

మహేశ్, ముఖేశ్ భట్​ మనస్పర్థలపై ఇమ్రాన్ క్లారిటీ!

బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత మహేశ్ భట్, ముఖేశ్ భట్​ల మధ్య మనస్పర్థలపై స్పందించాడు ఇమ్రాన్ హష్మీ. వారు విడిపోవడం అసంతృప్తి కలిగించినా త్వరలోనే మళ్లీ కలిసి సినిమాలు చేస్తామని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

author img

By

Published : May 15, 2021, 12:37 PM IST

Emraan Hashmi
ఇమ్రాన్ హష్మీ

బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత మహేశ్ భట్, ముఖేశ్ భట్​ కొన్ని మనస్పర్థల కారణంగా కలిసి చిత్రాలను నిర్మించడం ఆపేశారు. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ విడిపోయి చాలాకాలం అవుతుంది. 1987లో వీరు స్థాపించిన విశేష్ ఫిలింస్ ద్వారా గొప్ప సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఆ తర్వాత ఒకరికొకరు దూరమయ్యారు. తాజాగా వీరిద్దరి మధ్య బంధంపై స్పందించాడు బాలీవుడ్ నటుడు, వీరి బంధువు ఇమ్రాన్ హష్మీ. అన్ని మంచి విషయాలు ఎప్పుడో ఒకప్పుడు ముగియాల్సిందేనని వెల్లడించాడు.

"విశేష్​ ఫిలింస్​తో నాకు చాలా మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. మేమంతా మళ్లీ కలిసి సినిమాలు చేస్తామని ఆశిస్తున్నా. వారిద్దరి మధ్య గొడవలకి కారణం నాకు తెలియదు. కానీ మంచి విషయాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు ముగియాల్సిందే. పరిస్థితులు మారతాయి. ఏదీ శాశ్వతం కాదు. ఆ విషయం గురించి నాకేమీ తెలియకుండా మాట్లాడలేను. 'ముంబయి సాగా' విడుదలకు ముందు ముఖేశ్ జీ విష్ చేశారు. అలాగే మహేశ్​ భట్​తో కూడా సన్నిహితంగానే ఉన్నా. కానీ వారిద్దరు విడిపోవడం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నా."

-ఇమ్రాన్ హష్మీ, నటుడు

ఇటీవలే 'ముంబయి సాగా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇమ్రాన్. ఇతడు నటించిన 'చెహ్రే' విడుదలకు సిద్ధమైంది. కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడింది. అలాగే 'టైగర్ 3'లో కీలక పాత్ర పోషిస్తున్నాడీ హీరో.

బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత మహేశ్ భట్, ముఖేశ్ భట్​ కొన్ని మనస్పర్థల కారణంగా కలిసి చిత్రాలను నిర్మించడం ఆపేశారు. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ విడిపోయి చాలాకాలం అవుతుంది. 1987లో వీరు స్థాపించిన విశేష్ ఫిలింస్ ద్వారా గొప్ప సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఆ తర్వాత ఒకరికొకరు దూరమయ్యారు. తాజాగా వీరిద్దరి మధ్య బంధంపై స్పందించాడు బాలీవుడ్ నటుడు, వీరి బంధువు ఇమ్రాన్ హష్మీ. అన్ని మంచి విషయాలు ఎప్పుడో ఒకప్పుడు ముగియాల్సిందేనని వెల్లడించాడు.

"విశేష్​ ఫిలింస్​తో నాకు చాలా మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. మేమంతా మళ్లీ కలిసి సినిమాలు చేస్తామని ఆశిస్తున్నా. వారిద్దరి మధ్య గొడవలకి కారణం నాకు తెలియదు. కానీ మంచి విషయాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు ముగియాల్సిందే. పరిస్థితులు మారతాయి. ఏదీ శాశ్వతం కాదు. ఆ విషయం గురించి నాకేమీ తెలియకుండా మాట్లాడలేను. 'ముంబయి సాగా' విడుదలకు ముందు ముఖేశ్ జీ విష్ చేశారు. అలాగే మహేశ్​ భట్​తో కూడా సన్నిహితంగానే ఉన్నా. కానీ వారిద్దరు విడిపోవడం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నా."

-ఇమ్రాన్ హష్మీ, నటుడు

ఇటీవలే 'ముంబయి సాగా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇమ్రాన్. ఇతడు నటించిన 'చెహ్రే' విడుదలకు సిద్ధమైంది. కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడింది. అలాగే 'టైగర్ 3'లో కీలక పాత్ర పోషిస్తున్నాడీ హీరో.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.