బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత మహేశ్ భట్, ముఖేశ్ భట్ కొన్ని మనస్పర్థల కారణంగా కలిసి చిత్రాలను నిర్మించడం ఆపేశారు. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ విడిపోయి చాలాకాలం అవుతుంది. 1987లో వీరు స్థాపించిన విశేష్ ఫిలింస్ ద్వారా గొప్ప సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఆ తర్వాత ఒకరికొకరు దూరమయ్యారు. తాజాగా వీరిద్దరి మధ్య బంధంపై స్పందించాడు బాలీవుడ్ నటుడు, వీరి బంధువు ఇమ్రాన్ హష్మీ. అన్ని మంచి విషయాలు ఎప్పుడో ఒకప్పుడు ముగియాల్సిందేనని వెల్లడించాడు.
"విశేష్ ఫిలింస్తో నాకు చాలా మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. మేమంతా మళ్లీ కలిసి సినిమాలు చేస్తామని ఆశిస్తున్నా. వారిద్దరి మధ్య గొడవలకి కారణం నాకు తెలియదు. కానీ మంచి విషయాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు ముగియాల్సిందే. పరిస్థితులు మారతాయి. ఏదీ శాశ్వతం కాదు. ఆ విషయం గురించి నాకేమీ తెలియకుండా మాట్లాడలేను. 'ముంబయి సాగా' విడుదలకు ముందు ముఖేశ్ జీ విష్ చేశారు. అలాగే మహేశ్ భట్తో కూడా సన్నిహితంగానే ఉన్నా. కానీ వారిద్దరు విడిపోవడం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నా."
-ఇమ్రాన్ హష్మీ, నటుడు
ఇటీవలే 'ముంబయి సాగా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇమ్రాన్. ఇతడు నటించిన 'చెహ్రే' విడుదలకు సిద్ధమైంది. కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడింది. అలాగే 'టైగర్ 3'లో కీలక పాత్ర పోషిస్తున్నాడీ హీరో.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">