హీరోయిన్ కాజల్ అగర్వాల్, తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి, ముంబయిలో తొలి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోల్ని ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది.
ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూతో గతేడాది అక్టోబరులో కాజల్ పెళ్లి జరిగింది. ఆ తర్వాత సినిమా షూటింగ్ల్లో పాల్గొంది. కానీ ఇటీవల కరోనా సెకండే వేవ్ దృష్ట్యా, బయటకు వెళ్లకుండా భర్తతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తోంది.

ప్రస్తుతం ఈమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'లో నటిస్తోంది. దీని షూటింగ్ కూడా కరోనా కారణంగా నిలిచిపోయింది.