ప్రతిష్టాత్మక వెనిస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భారతీయ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత చైతన్య తమ్హానే తెరకెక్కించిన 'ది డిసిపుల్' చిత్రం ఎఫ్ఐపీఆర్ఈఎస్సీఐ అవార్డును సొంతం చేసుకుంది. గతంలో 1990లో అడూర్ గోపాలకృష్ణ రూపొందించిన 'మాథిలుకల్' చిత్రానికి ఈ అవార్డు లభించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఓ భారతీయ సినిమా ఈ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం.
ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ.. ఈ గెలుపు తనకు ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నారు. "మా పనిని గుర్తించి.. మద్దతుగా నిలిచిన జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా ఈ ప్రయాణంలో అద్భుతమైన గౌరవాన్ని పొందింనదుకు చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">