ETV Bharat / sitara

ప్రభుత్వం నన్ను జైల్లో పెట్టాలని చూస్తోంది: కంగన

author img

By

Published : Oct 23, 2020, 11:44 AM IST

తనపై నమోదవుతున్న కేసుల విషయమై నటి కంగనా రనౌత్ స్పందించింది. ప్రభుత్వం తనను జైల్లో పెట్టాలని చూస్తోందని వాపోయింది.

kangana ranaut
నటి కంగనా రనౌత్

మహారాష్ట్ర ప్రభుత్వం తనను జైలులో పెట్టాలనే ఉద్దేశంతో ఉందని బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ ఆరోపించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్లు చేస్తోందని నమోదైన ఫిర్యాదు మేరకు, ముంబయి పోలీసులు ఈమెకు సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలోనే కంగన ట్వీట్ చేసింది.

kangana ranaut tweet
కంగనా రనౌత్ ట్వీట్

"సావర్కర్, నేతా బోస్, రాణి ఆఫ్ ఝాన్సీ లాంటి వ్యక్తులను నమ్ముతాను. కానీ ప్రభుత్వం మాత్రం నన్ను జైల్లో పెట్టాలని చూస్తోంది. అయితే నేను అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. జైహింద్" -కంగనా రనౌత్ ట్వీట్

ఇటీవలే బాంద్రా కోర్టులో ఈమెపై కేసు నమోదవగా, శుక్రవారం అంధేరీ కోర్టులో ఓ న్యాయవాది కంగనపై కేసు పెట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్లు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

మహారాష్ట్ర ప్రభుత్వం తనను జైలులో పెట్టాలనే ఉద్దేశంతో ఉందని బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ ఆరోపించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్లు చేస్తోందని నమోదైన ఫిర్యాదు మేరకు, ముంబయి పోలీసులు ఈమెకు సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలోనే కంగన ట్వీట్ చేసింది.

kangana ranaut tweet
కంగనా రనౌత్ ట్వీట్

"సావర్కర్, నేతా బోస్, రాణి ఆఫ్ ఝాన్సీ లాంటి వ్యక్తులను నమ్ముతాను. కానీ ప్రభుత్వం మాత్రం నన్ను జైల్లో పెట్టాలని చూస్తోంది. అయితే నేను అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. జైహింద్" -కంగనా రనౌత్ ట్వీట్

ఇటీవలే బాంద్రా కోర్టులో ఈమెపై కేసు నమోదవగా, శుక్రవారం అంధేరీ కోర్టులో ఓ న్యాయవాది కంగనపై కేసు పెట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్లు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.