ETV Bharat / sitara

'ప్రభాస్ పాత్ర చేసేందుకు భయపడటం లేదు'

author img

By

Published : Dec 6, 2020, 10:15 AM IST

యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నాడు. టాలీవుడ్​లో బ్లాక్​బస్టర్​గా నిలిచిన 'ఛత్రపతి' హిందీ రీమేక్​లో ఇతడు హీరోగా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Bellamkonda Sai Sreenivas reveals the reason behind opting for the Hindi remake of Chatrapathi
'ప్రభాస్ పాత్ర చేసేందుకు భయపడటం లేదు'

'అల్లుడు శీను'తో కథానాయకుడిగా తెరంగేట్రం చేశాడు బెల్లకొండ సాయిశ్రీనివాస్‌. మొదటి సినిమాతో ప్రేక్షకులను అలరించిన శ్రీనివాస్‌.. ఆ తర్వాత 'సాక్ష్యం', 'జయ జానకి నాయక' లాంటి కుటుంబకథా చిత్రాలతో అభిమానులకు మరింత చేరువయ్యాడు. శ్రీనివాస్‌ నటించిన చిత్రాలు హిందీలో డబ్‌ కావడం వల్ల ముంబయిలో కూడా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. దీంతో అక్కడి ప్రేక్షకులనూ అలరించాలనే ఉద్దేశంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 'ఛత్రపతి' చిత్రంతో బీటౌన్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైన శ్రీనివాస్‌ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.

"నేను ఇప్పటివరకూ ఏడు సినిమాల్లో నటించా. వాటిల్లో ఆరు చిత్రాలు(హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌) యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూ‌స్‌ సాధించాయి. సినిమాల వల్ల ముంబయి, దిల్లీ ప్రాంతాల్లో ప్రజలు నన్ను గుర్తుపడుతున్నారు. అది నాకెంతో సంతోషంగా అనిపించింది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అనుకుంటున్నా. ఇంతకుముందు చాలా ఆఫర్స్‌ వచ్చినప్పటికీ నాకు సరిపడే స్ర్కిప్ట్‌ దొరకలేదు. 'ఛత్రపతి' కథ నాకు సరిపోతుందని అనుకుంటున్నా. ఒరిజినల్‌ వెర్షన్‌లో ప్రభాస్‌ పోషించిన పాత్రను రీక్రియేట్‌ చేయడానికి భయపడడం లేదు. అలాగే బాలీవుడ్‌కు చెందిన ఎక్కువమంది ప్రేక్షకులు ఒరిజినల్‌ చిత్రాన్ని వీక్షించలేదు"

Bellamkonda Sai Sreenivas reveals the reason behind opting for the Hindi remake of Chatrapathi
బెల్లంకొండ శ్రీనివాస్

"దశాబ్దం క్రితం తెరకెక్కించినప్పటికీ 'ఛత్రపతి' చిత్రాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. అయితే మేము ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని అందరికీ చేరువయ్యేలా స్ర్కిప్ట్‌లో మార్పులు చేశాం. కెరీర్‌ పరంగా నేను తీసుకున్న అదిపెద్ద నిర్ణయం ఇదే.. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా" అని బెల్లంకొండ శ్రీనివాస్‌ వివరించారు.

'అల్లుడు శీను'తో శ్రీనివాస్​ను కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం చేసిన వి.వి.వినాయక్‌.. 'ఛత్రపతి' బాలీవుడ్‌ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు.

'సీత' చిత్రం తర్వాత శ్రీనివాస్‌ తెలుగులో నటిస్తున్న సినిమా 'అల్లుడు అదుర్స్‌'. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. నటుడు సోనూసూద్‌ ఓ కీలకపాత్రలో మెప్పించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

'అల్లుడు శీను'తో కథానాయకుడిగా తెరంగేట్రం చేశాడు బెల్లకొండ సాయిశ్రీనివాస్‌. మొదటి సినిమాతో ప్రేక్షకులను అలరించిన శ్రీనివాస్‌.. ఆ తర్వాత 'సాక్ష్యం', 'జయ జానకి నాయక' లాంటి కుటుంబకథా చిత్రాలతో అభిమానులకు మరింత చేరువయ్యాడు. శ్రీనివాస్‌ నటించిన చిత్రాలు హిందీలో డబ్‌ కావడం వల్ల ముంబయిలో కూడా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. దీంతో అక్కడి ప్రేక్షకులనూ అలరించాలనే ఉద్దేశంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 'ఛత్రపతి' చిత్రంతో బీటౌన్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైన శ్రీనివాస్‌ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.

"నేను ఇప్పటివరకూ ఏడు సినిమాల్లో నటించా. వాటిల్లో ఆరు చిత్రాలు(హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌) యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూ‌స్‌ సాధించాయి. సినిమాల వల్ల ముంబయి, దిల్లీ ప్రాంతాల్లో ప్రజలు నన్ను గుర్తుపడుతున్నారు. అది నాకెంతో సంతోషంగా అనిపించింది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అనుకుంటున్నా. ఇంతకుముందు చాలా ఆఫర్స్‌ వచ్చినప్పటికీ నాకు సరిపడే స్ర్కిప్ట్‌ దొరకలేదు. 'ఛత్రపతి' కథ నాకు సరిపోతుందని అనుకుంటున్నా. ఒరిజినల్‌ వెర్షన్‌లో ప్రభాస్‌ పోషించిన పాత్రను రీక్రియేట్‌ చేయడానికి భయపడడం లేదు. అలాగే బాలీవుడ్‌కు చెందిన ఎక్కువమంది ప్రేక్షకులు ఒరిజినల్‌ చిత్రాన్ని వీక్షించలేదు"

Bellamkonda Sai Sreenivas reveals the reason behind opting for the Hindi remake of Chatrapathi
బెల్లంకొండ శ్రీనివాస్

"దశాబ్దం క్రితం తెరకెక్కించినప్పటికీ 'ఛత్రపతి' చిత్రాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. అయితే మేము ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని అందరికీ చేరువయ్యేలా స్ర్కిప్ట్‌లో మార్పులు చేశాం. కెరీర్‌ పరంగా నేను తీసుకున్న అదిపెద్ద నిర్ణయం ఇదే.. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా" అని బెల్లంకొండ శ్రీనివాస్‌ వివరించారు.

'అల్లుడు శీను'తో శ్రీనివాస్​ను కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం చేసిన వి.వి.వినాయక్‌.. 'ఛత్రపతి' బాలీవుడ్‌ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు.

'సీత' చిత్రం తర్వాత శ్రీనివాస్‌ తెలుగులో నటిస్తున్న సినిమా 'అల్లుడు అదుర్స్‌'. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. నటుడు సోనూసూద్‌ ఓ కీలకపాత్రలో మెప్పించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.