మాదక ద్రవ్యాల ముఠాతో లింకు ఉన్న కన్నడ సినీ పరిశ్రమకు చెందిన దాదాపు 15మంది ప్రముఖుల పేర్లను వెల్లడించాడు సినీప్రముఖుడు, జర్నలిస్ట్ ఇంద్రజిత్ లంకేశ్. వీరంతా ముంబయికి చెందిన డ్రగ్స్ సరఫరదారుల వద్ద కొనుగోలు చేస్తారని తెలిపాడు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) తనను చేసిన విచారణలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.
"బడా సంగీతకారులు, నటులు డ్రగ్స్ ముఠాతో సంబంధం కలిగి ఉన్నారు. ప్రస్తుతం వారు సమాజంలో యూత్ ఐకాన్గా వెలుగొందుతున్నారు. వారి పేర్లను అధికారులకు తెలిపా."
-ఇంద్రజిత్ లంకేశ్, సినీ ప్రముఖుడు జర్నలిస్ట్
బెంగళూరులో డ్రగ్స్ మాఫియా విజృంభిస్తుందన్న సమాచారంతో ఎన్సీబీ చేపట్టిన ఆపరేషన్లో పలు కీలక విషయాలు తెలిశాయి. ఈ ఆపరేషన్లో దాదాపు రూ. 2 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలను సీజ్ చేసి.. పలువురు డ్రగ్ డీలర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధమున్న పలువురు ప్రముఖులను ఎన్సీబీ ఇప్పటికే అరెస్ట్ చేసింది.
ఇది చూడండి సినీ పరిశ్రమతో డ్రగ్స్ ముఠా లింకులపై ఆరా