ETV Bharat / sitara

'అది ఫేక్​న్యూస్​.. చట్టపరమైన చర్యలు​ తీసుకుంటా'

author img

By

Published : Jun 1, 2020, 12:04 PM IST

Updated : Jun 1, 2020, 2:54 PM IST

తనపై వస్తున్న అసత్య ప్రచారాలను ఖండించిన అక్షయ్ కుమార్.. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.

Akshay Kumar refutes claims of booking charter flight for sister
'అది ఫేక్​ న్యూస్​.. లీగల్​ యాక్షన్​ తీసుకుంటా'

తన సోదరి కోసం ఓ ఛార్టెడ్​ విమానాన్ని బుక్​ చేశాననే వార్తల్లో నిజం లేదని బాలీవుడ్​ స్టార్​హీరో అక్షయ్​కుమార్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతడి సోదరి అల్కా భాటియా.. తన పిల్లలతో సహా ముంబయి నుంచి దిల్లీకి వెళ్లేందుకు అక్షయ్ ఓ ప్రత్యేక విమానాన్ని బుక్​ చేశాడనే వార్తలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించారు​.

  • This news about me booking a charter flight for my sister and her two kids is FAKE from start to end.She has not travelled anywhere since the lockdown and she has only one child!Contemplating legal action,enough of putting up with false, concocted reports! https://t.co/iViBGW5cmE

    — Akshay Kumar (@akshaykumar) May 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నా సోదరి, ఆమె ఇద్దరు పిల్లల కోసం ఛార్టెడ్​ విమానాన్ని బుక్​ చేశా'.. అనే వార్తలు అసత్యాలు. లాక్​డౌన్​ అమలు చేసినప్పటి నుంచి తాను ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. మరో విషయమేమిటంటే ఆమెకు ఒక్కరే సంతానం. ఇలాంటి అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా."

-అక్షయ్​ కుమార్​, బాలీవుడ్​ కథానాయకుడు

ఈ మధ్య ఓ మ్యూజిక్​ వీడియోలో అక్షయ్ నటించారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఖండిస్తూ ట్వీట్​ చేశారు. "కరోనా సంక్షోభంలో చాలా అసత్య వార్తలు ప్రచారమవుతున్నాయి. దీంతో పాటు ఇప్పుడు ఫేక్​ కాస్టింగ్​నూ నాకు జత చేస్తున్నారు" అని వెల్లడించారు అక్కీ.

లాక్​డౌన్​ వల్ల ఇంటికే పరిమితమైన ఈ హీరో.. కుటుంబంతో సమయాన్ని సంతోషంగా గడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రూపొందించిన ఓ యాడ్​ కోసం, బల్కీ దర్శకత్వంలోనూ నటించారు.

ఇదీ చూడండి... ఆ అడవుల్లో బన్నీ 'పుష్ప' షూటింగ్!

తన సోదరి కోసం ఓ ఛార్టెడ్​ విమానాన్ని బుక్​ చేశాననే వార్తల్లో నిజం లేదని బాలీవుడ్​ స్టార్​హీరో అక్షయ్​కుమార్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతడి సోదరి అల్కా భాటియా.. తన పిల్లలతో సహా ముంబయి నుంచి దిల్లీకి వెళ్లేందుకు అక్షయ్ ఓ ప్రత్యేక విమానాన్ని బుక్​ చేశాడనే వార్తలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించారు​.

  • This news about me booking a charter flight for my sister and her two kids is FAKE from start to end.She has not travelled anywhere since the lockdown and she has only one child!Contemplating legal action,enough of putting up with false, concocted reports! https://t.co/iViBGW5cmE

    — Akshay Kumar (@akshaykumar) May 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నా సోదరి, ఆమె ఇద్దరు పిల్లల కోసం ఛార్టెడ్​ విమానాన్ని బుక్​ చేశా'.. అనే వార్తలు అసత్యాలు. లాక్​డౌన్​ అమలు చేసినప్పటి నుంచి తాను ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. మరో విషయమేమిటంటే ఆమెకు ఒక్కరే సంతానం. ఇలాంటి అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా."

-అక్షయ్​ కుమార్​, బాలీవుడ్​ కథానాయకుడు

ఈ మధ్య ఓ మ్యూజిక్​ వీడియోలో అక్షయ్ నటించారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఖండిస్తూ ట్వీట్​ చేశారు. "కరోనా సంక్షోభంలో చాలా అసత్య వార్తలు ప్రచారమవుతున్నాయి. దీంతో పాటు ఇప్పుడు ఫేక్​ కాస్టింగ్​నూ నాకు జత చేస్తున్నారు" అని వెల్లడించారు అక్కీ.

లాక్​డౌన్​ వల్ల ఇంటికే పరిమితమైన ఈ హీరో.. కుటుంబంతో సమయాన్ని సంతోషంగా గడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రూపొందించిన ఓ యాడ్​ కోసం, బల్కీ దర్శకత్వంలోనూ నటించారు.

ఇదీ చూడండి... ఆ అడవుల్లో బన్నీ 'పుష్ప' షూటింగ్!

Last Updated : Jun 1, 2020, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.