ETV Bharat / opinion

కరోనా మహమ్మారి నుంచి ప్రవాసులకు రక్షణేది?

భారతీయులు విద్యాఉపాధుల కోసం వెళ్లిన దేశాల్లో నేడు కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ తరంవారికన్నా ఎన్నో ఏళ్ల ముందే విదేశాలకు వెళ్లి స్థిరపడిన భారత సంతతివారు కూడా కొవిడ్‌ విషపు నీడలో కలవరపడుతున్నారు. కరోనా వైరస్‌ను శీఘ్రంగా కట్టడి చేసి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మళ్ళీ కొత్త ఊపు తీసుకురాకపోతే వీరంతా మాతృదేశం ఆసరా కోసం ఎదురుచూస్తారు. ఇప్పటికే 130 కోట్ల జనాభాతో సతమతమవుతున్న భారతదేశానికి ఇది కొత్త సవాలు కానుంది.

author img

By

Published : Apr 15, 2020, 9:39 AM IST

motherland
కరోనా మహమ్మారి నుంచి ప్రవాసీలకు రక్షణేది?

భారతీయులు విద్యాఉపాధుల కోసం వెళ్లిన దేశాల్లో నేడు కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ తరంవారికన్నా ఎన్నో ఏళ్ల ముందే విదేశాలకు వెళ్లి స్థిరపడిన భారత సంతతివారు కూడా కొవిడ్‌ విషపు నీడలో కలవరపడుతున్నారు. ఈ రెండు వర్గాలూ కలిసి ప్రపంచమంతటా మూడు కోట్ల వరకు ఉంటారు. కరోనా వైరస్‌ను శీఘ్రంగా కట్టడి చేసి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మళ్ళీ కొత్త ఊపు తీసుకురాకపోతే వీరంతా మాతృదేశం ఆసరా కోసం ఎదురుచూస్తారు. ఇప్పటికే 130 కోట్ల పైచిలుకు జనాభాతో సతమతమవుతున్న భారతదేశానికి ఇది కొత్త సవాలు కానుంది.

స్వదేశంలో సరైన అవకాశాలు లేక భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పాశ్చాత్య దేశాలకు బారులు తీరడాన్ని మేధావలసగా వర్ణించేవాళ్లం. సమాచార సాంకేతికత (ఐటీ) విస్పోటం తరవాత లక్షలాది భారతీయ నిపుణులను అమెరికా ఆకర్షించింది. మరోవైపు అనేకమంది కూలీలు పెద్ద సంఖ్యలో గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ రెండు వర్గాలవారు పెద్దయెత్తున స్వదేశానికి పంపే విదేశమారక ద్రవ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. విదేశాల్లో ఉంటున్న భారత సంతతి మొత్తం ఆస్తులు భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని మించిపోయాయని అంచనా.

ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం

అమెరికాకు లేదా గల్ఫ్‌ దేశాలకు భారతీయుల వలసలు ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం కాకుండా స్వచ్ఛందంగా జరిగాయి. వీరిలో అత్యధికులు ఆయాదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల వద్ద తమ పేర్లు, చిరునామాలను అధికారికంగా నమోదు చేసుకోలేదు. విదేశాల్లో భారతీయుల నైపుణ్యం, కష్టించి పనిచేసే తత్వం అక్కడి ప్రభుత్వాల మన్ననలు అందుకున్నాయి. వారు స్వదేశానికి పంపే లక్షల కోట్ల రూపాయలు వారి కుటుంబాలకే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ లాభించాయి. ప్రవాసుల కుటుంబాలు ఇళ్లు, పొలాలు, బంగారం కొనుక్కుంటే, ప్రభుత్వాలకు వాటిమీద పన్నుల ఆదాయం పెరిగింది. ఈ ఉభయ తారక లావాదేవీలవల్ల సర్కారుకు ప్రవాసుల బాగోగుల పట్ల ఆసక్తి పెరిగింది. విదేశాల్లోని భారత రాయబార, దౌత్య కార్యాలయాల్లో ప్రవాసుల కోసం ప్రత్యేక విభాగాలు తెరచింది. భారత్‌లోని రాజకీయ నాయకులు ప్రవాస భారతీయ సంఘాల నేతలతో సాన్నిహిత్యం పెంచుకుని, కీలక సమయాల్లో విరాళాలూ పొందుతున్నారు.

యుద్ధాలు, తిరుగుబాట్లు, ప్రకృతి ప్రకోపాల వల్ల విదేశాల్లో ప్రవాస భారతీయులకు; ఎప్పుడు ఏ కష్టం వచ్చినా భారతదేశం వారిని ఆదుకోవడానికి చప్పున రంగంలోకి దిగుతోంది. ఇది గతంలో ఎరుగని స్థితి. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో బర్మా, ఉగాండా, కొన్ని కరీబియన్‌ దేశాల నుంచి ప్రవాసులు నిష్క్రమించాల్సి వచ్చినప్పుడు భారత సర్కారు నేరుగా జోక్యం చేసుకోకుండా, స్వదేశానికి వచ్చినవారికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టేది.

ఫిజీ వేధింపుల నాటి నుంచి..

కానీ, 1980లలో ఫిజీలో భారతీయులను వేధింపులకు గురిచేసిన సైనిక ప్రభుత్వాన్ని కామన్వెల్త్‌ నుంచి బహిష్కరింపజేయడానికి ఆనాటి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం చొరవ తీసుకున్నప్పటి నుంచి భారత్‌ వైఖరిలో మార్పు రాసాగింది. కరోనా వైరస్‌ ప్రవాస భారతీయుల ద్వారానే భారత్‌లో పాదం మోపింది. తొలి కరోనా కేసు వుహాన్‌ నుంచి కేరళకు వచ్చింది. ఆ తరవాత ఇటలీ, స్పెయిన్‌, ఇరాన్‌లలోని భారతీయులు కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి సొంత గడ్డకు తిరిగిరావాలని తహతహలాడసాగారు. కానీ, భారత ప్రభుత్వం విమానాశ్రయాలను బంద్‌ చేయడంతో ఎక్కడి ప్రవాస భారతీయులు అక్కడే ఉండిపోయారు.

దేశదేశాల్లో చిక్కుపడిన భారతీయులను తీసుకురావడానికి కావలసిన విమానాలు మనకు లేవు. అమెరికా, ఐరోపా, పశ్చిమాసియా దేశాల్లోని భారత సంతతివారందరినీ స్వదేశానికి తీసుకొచ్చినా, ఆ తాకిడిని తట్టుకునే సత్తా భారతదేశానికి లేక పెను సంక్షోభం విరుచుకుపడుతుంది. ప్రస్తుతం అన్ని దేశాలూ విమాన ప్రయాణాలను రద్దు చేసినందున కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చేంతవరకు అందరూ ఓర్పుగా వేచిఉండక తప్పదు.

అండగా ఉండాల్సిన తరుణమిది

వైద్యులు, నర్సులు, చికిత్సా సదుపాయాలను పెద్దయెత్తున సమకూర్చుకున్న తరవాత ప్రవాసుల పునరాగమనానికి ఏర్పాట్లు మొదలుపెట్టాలి. అలాగని ప్రవాసులందరూ పొలోమంటూ ఒకేసారి వచ్చేస్తే నిభాయించడమూ కష్టమే. కాబట్టి, విదేశాలకు వలసవెళ్లిన భారతీయ కార్మికులు, నిపుణులకు పరిస్థితులు కుదుటపడేవరకు ఉపాధి నిలబడేట్లు, సమంజస వేతనాలు లభించేట్లు ఆయా ప్రభుత్వాలను ఒప్పించడానికి భారత ప్రభుత్వం కృషిచేయాలి. ఇప్పుడు స్వదేశంలో వలస కార్మికులకు పట్టిన గతి విదేశాల్లోనూ పట్టకుండా జాగ్రత్తపడాలి.

మొదటి గల్ఫ్‌ యుద్ధకాలంలో కువైట్‌, ఇరాక్‌లలోని భారతీయ కార్మికులను స్వదేశం తీసుకురావడానికి భారత్‌ హడావుడి చేయడం, ఆ ప్రభుత్వాలకు నచ్చలేదు. తమకు ఎంతో అవసరమైన సమయంలో భారతీయులు నిష్క్రమించడమేమిటని రుసరుసలాడాయి. ఇప్పుడు కూడా పాశ్చాత్య దేశాలకు, గల్ఫ్‌ దేశాలకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. వారు ఉన్నపళాన మనవాళ్లను పంపడానికి సుముఖత చూపకపోవచ్చు. అయితే, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో పరిస్థితి భిన్నంగా ఉంది. తమ దేశంలో ఉన్న విదేశీయుల్లో కరోనా పాజిటివ్‌ ఉన్నవారికి తామే చికిత్స అందిస్తామని, వైరస్‌ సోకనివారిని మాత్రం తీసుకువెళ్లాలని పలు దేశాలకు యూఏఈ విజ్ఞప్తి చేసింది. దాన్ని ఖాతరు చేయని దేశాలపై వాణిజ్య ఒప్పందాల రద్దు వంటి కఠిన ఆంక్షలకూ సిద్ధమయింది. భారతప్రభుత్వం ఇలా సమస్య పూర్వాపరాలను గమనంలోకి తీసుకుని, మన నిపుణులు, కార్మికులకు అండగా నిలవాలి.

(రచయిత- టీపీ శ్రీనివాసన్‌- పలు దేశాలకు మాజీ రాయబారి)

భారతీయులు విద్యాఉపాధుల కోసం వెళ్లిన దేశాల్లో నేడు కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ తరంవారికన్నా ఎన్నో ఏళ్ల ముందే విదేశాలకు వెళ్లి స్థిరపడిన భారత సంతతివారు కూడా కొవిడ్‌ విషపు నీడలో కలవరపడుతున్నారు. ఈ రెండు వర్గాలూ కలిసి ప్రపంచమంతటా మూడు కోట్ల వరకు ఉంటారు. కరోనా వైరస్‌ను శీఘ్రంగా కట్టడి చేసి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మళ్ళీ కొత్త ఊపు తీసుకురాకపోతే వీరంతా మాతృదేశం ఆసరా కోసం ఎదురుచూస్తారు. ఇప్పటికే 130 కోట్ల పైచిలుకు జనాభాతో సతమతమవుతున్న భారతదేశానికి ఇది కొత్త సవాలు కానుంది.

స్వదేశంలో సరైన అవకాశాలు లేక భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పాశ్చాత్య దేశాలకు బారులు తీరడాన్ని మేధావలసగా వర్ణించేవాళ్లం. సమాచార సాంకేతికత (ఐటీ) విస్పోటం తరవాత లక్షలాది భారతీయ నిపుణులను అమెరికా ఆకర్షించింది. మరోవైపు అనేకమంది కూలీలు పెద్ద సంఖ్యలో గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ రెండు వర్గాలవారు పెద్దయెత్తున స్వదేశానికి పంపే విదేశమారక ద్రవ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. విదేశాల్లో ఉంటున్న భారత సంతతి మొత్తం ఆస్తులు భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని మించిపోయాయని అంచనా.

ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం

అమెరికాకు లేదా గల్ఫ్‌ దేశాలకు భారతీయుల వలసలు ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం కాకుండా స్వచ్ఛందంగా జరిగాయి. వీరిలో అత్యధికులు ఆయాదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల వద్ద తమ పేర్లు, చిరునామాలను అధికారికంగా నమోదు చేసుకోలేదు. విదేశాల్లో భారతీయుల నైపుణ్యం, కష్టించి పనిచేసే తత్వం అక్కడి ప్రభుత్వాల మన్ననలు అందుకున్నాయి. వారు స్వదేశానికి పంపే లక్షల కోట్ల రూపాయలు వారి కుటుంబాలకే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ లాభించాయి. ప్రవాసుల కుటుంబాలు ఇళ్లు, పొలాలు, బంగారం కొనుక్కుంటే, ప్రభుత్వాలకు వాటిమీద పన్నుల ఆదాయం పెరిగింది. ఈ ఉభయ తారక లావాదేవీలవల్ల సర్కారుకు ప్రవాసుల బాగోగుల పట్ల ఆసక్తి పెరిగింది. విదేశాల్లోని భారత రాయబార, దౌత్య కార్యాలయాల్లో ప్రవాసుల కోసం ప్రత్యేక విభాగాలు తెరచింది. భారత్‌లోని రాజకీయ నాయకులు ప్రవాస భారతీయ సంఘాల నేతలతో సాన్నిహిత్యం పెంచుకుని, కీలక సమయాల్లో విరాళాలూ పొందుతున్నారు.

యుద్ధాలు, తిరుగుబాట్లు, ప్రకృతి ప్రకోపాల వల్ల విదేశాల్లో ప్రవాస భారతీయులకు; ఎప్పుడు ఏ కష్టం వచ్చినా భారతదేశం వారిని ఆదుకోవడానికి చప్పున రంగంలోకి దిగుతోంది. ఇది గతంలో ఎరుగని స్థితి. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో బర్మా, ఉగాండా, కొన్ని కరీబియన్‌ దేశాల నుంచి ప్రవాసులు నిష్క్రమించాల్సి వచ్చినప్పుడు భారత సర్కారు నేరుగా జోక్యం చేసుకోకుండా, స్వదేశానికి వచ్చినవారికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టేది.

ఫిజీ వేధింపుల నాటి నుంచి..

కానీ, 1980లలో ఫిజీలో భారతీయులను వేధింపులకు గురిచేసిన సైనిక ప్రభుత్వాన్ని కామన్వెల్త్‌ నుంచి బహిష్కరింపజేయడానికి ఆనాటి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం చొరవ తీసుకున్నప్పటి నుంచి భారత్‌ వైఖరిలో మార్పు రాసాగింది. కరోనా వైరస్‌ ప్రవాస భారతీయుల ద్వారానే భారత్‌లో పాదం మోపింది. తొలి కరోనా కేసు వుహాన్‌ నుంచి కేరళకు వచ్చింది. ఆ తరవాత ఇటలీ, స్పెయిన్‌, ఇరాన్‌లలోని భారతీయులు కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి సొంత గడ్డకు తిరిగిరావాలని తహతహలాడసాగారు. కానీ, భారత ప్రభుత్వం విమానాశ్రయాలను బంద్‌ చేయడంతో ఎక్కడి ప్రవాస భారతీయులు అక్కడే ఉండిపోయారు.

దేశదేశాల్లో చిక్కుపడిన భారతీయులను తీసుకురావడానికి కావలసిన విమానాలు మనకు లేవు. అమెరికా, ఐరోపా, పశ్చిమాసియా దేశాల్లోని భారత సంతతివారందరినీ స్వదేశానికి తీసుకొచ్చినా, ఆ తాకిడిని తట్టుకునే సత్తా భారతదేశానికి లేక పెను సంక్షోభం విరుచుకుపడుతుంది. ప్రస్తుతం అన్ని దేశాలూ విమాన ప్రయాణాలను రద్దు చేసినందున కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చేంతవరకు అందరూ ఓర్పుగా వేచిఉండక తప్పదు.

అండగా ఉండాల్సిన తరుణమిది

వైద్యులు, నర్సులు, చికిత్సా సదుపాయాలను పెద్దయెత్తున సమకూర్చుకున్న తరవాత ప్రవాసుల పునరాగమనానికి ఏర్పాట్లు మొదలుపెట్టాలి. అలాగని ప్రవాసులందరూ పొలోమంటూ ఒకేసారి వచ్చేస్తే నిభాయించడమూ కష్టమే. కాబట్టి, విదేశాలకు వలసవెళ్లిన భారతీయ కార్మికులు, నిపుణులకు పరిస్థితులు కుదుటపడేవరకు ఉపాధి నిలబడేట్లు, సమంజస వేతనాలు లభించేట్లు ఆయా ప్రభుత్వాలను ఒప్పించడానికి భారత ప్రభుత్వం కృషిచేయాలి. ఇప్పుడు స్వదేశంలో వలస కార్మికులకు పట్టిన గతి విదేశాల్లోనూ పట్టకుండా జాగ్రత్తపడాలి.

మొదటి గల్ఫ్‌ యుద్ధకాలంలో కువైట్‌, ఇరాక్‌లలోని భారతీయ కార్మికులను స్వదేశం తీసుకురావడానికి భారత్‌ హడావుడి చేయడం, ఆ ప్రభుత్వాలకు నచ్చలేదు. తమకు ఎంతో అవసరమైన సమయంలో భారతీయులు నిష్క్రమించడమేమిటని రుసరుసలాడాయి. ఇప్పుడు కూడా పాశ్చాత్య దేశాలకు, గల్ఫ్‌ దేశాలకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. వారు ఉన్నపళాన మనవాళ్లను పంపడానికి సుముఖత చూపకపోవచ్చు. అయితే, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో పరిస్థితి భిన్నంగా ఉంది. తమ దేశంలో ఉన్న విదేశీయుల్లో కరోనా పాజిటివ్‌ ఉన్నవారికి తామే చికిత్స అందిస్తామని, వైరస్‌ సోకనివారిని మాత్రం తీసుకువెళ్లాలని పలు దేశాలకు యూఏఈ విజ్ఞప్తి చేసింది. దాన్ని ఖాతరు చేయని దేశాలపై వాణిజ్య ఒప్పందాల రద్దు వంటి కఠిన ఆంక్షలకూ సిద్ధమయింది. భారతప్రభుత్వం ఇలా సమస్య పూర్వాపరాలను గమనంలోకి తీసుకుని, మన నిపుణులు, కార్మికులకు అండగా నిలవాలి.

(రచయిత- టీపీ శ్రీనివాసన్‌- పలు దేశాలకు మాజీ రాయబారి)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.