ఇటీవల ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్లో నకిలీ ఖాతాల బెడద పెరగడం వల్ల పోలీస్ ఉన్నతాధికారులు వీటిపై దృష్టి సారించారు. సైబర్ నేరగాళ్లు పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సైబరాబాద్ కమిషనరేట్లో వెబినార్ నిర్వహించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్... సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులతో చర్చించారు.
పేస్బుక్ ఖాతాలో ఫోటో, ఇతర వివరాలను సేకరించి సైబర్ నేరగాళ్లు సులభంగా నకిలీ ఖాతా సృష్టిస్తున్నందున... వీటిని నిరోధించాలని పేస్బుక్ ప్రతినిధులను సజ్జనార్ కోరారు. సానుకూలంగా స్పందించిన ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ ప్రతినిధులు సైబర్ నేరగాళ్ల నకిలీ ఖాతాలను అడ్డుకుంటామని భరోసా ఇచ్చారు. సామాజిక మాధ్యమాల వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నకిలీ ఖాతాల బెడద నుంచి బయటపడొచ్చని ఫేస్బుక్ ప్రతినిధులు సూచించారు.
ఇదీ చూడండి: ఈ దొంగలు ఏకంగా జవాన్ల అవతారమెత్తి మోసగిస్తున్నారు : సజ్జనార్