ETV Bharat / jagte-raho

చెట్టును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. ఇద్దరు మృతి - telangana varthalu

ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం... ఇద్దరు మృతి
చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం... ఇద్దరు మృతి
author img

By

Published : Jan 12, 2021, 7:07 PM IST

మహబూబ్ నగర్ జిల్లా 44వ జాతీయ రహదారిపై అన్నసాగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. భూత్పూర్ మండలం తాటికొండ, నెహ్రూ నగర్ గ్రామాలకు చెందిన ప్రసాద్(25), శివ (22) జడ్చర్ల సమీపంలో పోలేపల్లి సెజ్​లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు.

మంగళవారం విధులు ముగించుకుని గ్రామానికి వస్తుండగా.. ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరూ హెల్మెట్లు ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

మహబూబ్ నగర్ జిల్లా 44వ జాతీయ రహదారిపై అన్నసాగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. భూత్పూర్ మండలం తాటికొండ, నెహ్రూ నగర్ గ్రామాలకు చెందిన ప్రసాద్(25), శివ (22) జడ్చర్ల సమీపంలో పోలేపల్లి సెజ్​లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు.

మంగళవారం విధులు ముగించుకుని గ్రామానికి వస్తుండగా.. ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరూ హెల్మెట్లు ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: ఆర్టీసీ బస్సు ఢీకొట్టి వ్యక్తి అక్కడికక్కడే మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.