ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయ మాధారంలో వేద పాఠశాల విద్యార్థి గురువు మందలించాడనే కారణంతో కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం రేఖపల్లికి చెందిన యామిని శేషు(18).. రెండేళ్లుగా రాయ మాధారంలోని ఓ వేద పాఠశాలలో శిక్షణ పొందుతున్నాడు. ఈ నెల 1న రాత్రి పాఠశాలలో చోటుచేసుకున్న ఓ సంఘటనపై గురువు మందలించాడు.
మనస్తాపం చెందిన ఆ విద్యార్థి పాఠశాల సమీపంలోని కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలువలో దూకిన శేషు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిమ్మారావుపేట సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. ఈ నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : దొంగతనం చేస్తుండగా దొరికిపోయారు.!