సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి రూ.14.3 లక్షలు దోచుకున్నారు. సికింద్రాబాద్కి చెందిన డాక్టర్ అర్జున్ రావు ఇంటర్నెట్ బ్యాంక్తో లింకై ఉన్న మెయిల్ ఐడీని హ్యాక్ చేసి 8 లక్షలు సైబర్ చీటర్స్ కాజేశారు.
మరో కేసులో కాచిగూడకి చెందిన శేషగిరిరావు తన క్రెడిట్ కార్డ్ బిల్లు ఆన్లైన్లో కట్టే సందర్భంలో ఓ యాప్ డౌన్లోడ్ చేశాడు. దీంతో తన అకౌంట్లో ఉన్న 6.3 లక్షల రూపాయలు మాయమయ్యాయి.
మోసపోయామని తెలుసుకున్న ఇద్దరు బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈ మెయిల్ లింక్ ఉన్న వినియోగదారులు మెయిల్కి వచ్చే ఓటీపీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చూడండి : ఓఆర్ఆర్పై బస్సు దగ్ధం